అందాల తార పూజా హెగ్దె ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఆమె అగ్ర కథానాయిక. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అమె నటించిన సినిమాలు అంతగా ఆడకపోయిన తెలుగులో హీరోయిన్స్ కొరత వలన ఆమెకు అవకాశలు వస్తున్నాయి.ఈ సమయన్ని మంచిగా క్యాస్ చేసుకుంటుంది.ఆమె దగ్గరికి వచ్చిన అన్ని సినిమాలకు భారీ మొత్తంలో పారితోషకం డిమాండ్ చేస్తుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ -అల్లు అర్జున్ కాంబో లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురం. ఈ సినిమా లో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల వైకుంఠపురం సినిమా కోసం భారీ మొత్తంలో పారితోషకం తీసుకున్నదని సమాచారం. ఈ సినిమా సెట్ లో పూజా హెగ్దె ప్రవర్తన సరిగా లేకపోవడం వలన దర్శకుడు త్రివిక్రమ్ ఇబ్బంది పడుతున్నాడని రూమర్స్ వస్తున్నాయి.
పూజా హెగ్దె షూటింగ్ కు ఆలస్యంగా వస్తుందని మరియు లంచ్ టైమ్ లో బయటకి వేళ్లి సినిమా సెట్ కి ఆలస్యంగా వస్తుందని వార్తలు వస్తున్నాయి . ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయలని త్రివిక్రమ్ మరియు బన్నీలు ప్రయత్నిస్తున్నారు. కానీ పూజా హెగ్దె ప్రవర్తన వల్ల రిలీజ్ ఆలస్యం అయ్యె ప్రమాదం ఉందని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భయపడుతున్నాడని రూమర్స్ బయటకు వస్తున్నాయి. ఈ రూమర్స్ లో ఎంత వరకు నిజం ఉందో మనకు తెలియదు.
పూజా హెగ్దె త్రివిక్రమ్ తో కలిసి పని చేయడం ఇది రెండో సారి. 2018 లో త్రివిక్రమ్- తారక్ కాంబో లో వచ్చిన "అరవింద సమేత"లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పూజా హెగ్దె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన "వాల్మికి" సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వాల్మికి సెప్టంబర్ 20 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.