చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన సమయంలో దేశం మొత్తం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. చంద్రయాన్ 2 ప్రయోగంలో నిన్న సాయంత్రం దాకా దాదాపుగా అన్ని దశలు విజయవంతమైనా... చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్  విక్రమ్ ల్యాండయ్యేందుకు పట్టే 15 నిమిషాలు అత్యంత కీలకం అని అందరికి తెలిసిందే. ఈ కీలక సమయంలో విక్రమ్ తో కంట్రోల్ రూంకు ఉన్న సిగ్నల్స్ ఒక్కసారిగా  తెగిపోయాయి. అయినా మొక్కవోని సంకల్పంతో సిగ్నల్స్ ను పునరుద్ధరించేందుకు ఇస్రో చేసిన యత్నాలేవీ ఫలించలేదు. దీంతో చంద్రయాన్ 2 విఫల ప్రయోగంగా మిగిలిపోయింది. 

ఇప్పుడిప్పుడే వరుస ప్రయోగాలతో మంచి ఊపు మీద కనిపిస్తున్న ఇస్రో... చంద్రయాన్ 2 వంటి కీలక ప్రయోగంలో విఫలమవడంతో ఆ సంస్థ చైర్మైన్ గా ఉన్న శివన్ నిజంగానే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. చంద్రుడికి కేవలం 2.1 కిలో మీట్ల దూరంలో ఉండగా కంట్రోల్ రూంతో విక్రమ్ కు సిగ్నల్స్ నిలిచిపోవడంతో ఇస్రో మూగబోయింది. ఇకపోతే ఈ  చంద్రయాన్-2 విఫలమైనా ఇస్రో శాస్త్రవేత్తల కృషికి దేశవ్యాప్తంగా నీరాజనాలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో  తాజాగా టాలీవుడ్  అగ్రహీరో సూపర్ స్టార్  మహేశ్ బాబు ఇస్రో సైంటిస్టులకు  బాసటగా నిలిచాడు. 

మీరే మా నిజమైన కథానాయకులు. మీ వెంటే మేమున్నాం. మీలో ప్రతి ఒక్కరికీ వందనం చేస్తున్నా. ఇది మీ విజయగాథకు ఆరంభం మాత్రమే. మున్ముందు మరెంతో సాధించాల్సి ఉంది అంటూ వారికీ దైర్యం చెప్పారు. ఇదే సమయంలో ఈ సందర్భంగా మహేశ్ బాబు తన మహర్షి చిత్రంలోని పాపులర్  డైలాగును కూడా వాడేశారు. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఏ జర్నీ  అంటూ సైంటిస్టులకు సపోర్ట్ గా నిలిచాడు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా చేస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: