టాలీవుడ్ లో మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వివివినాయక్.  అయితే కొంత కాలంగా ఈ దర్శకుడికి పెద్దగా కలిసి రావడం లేదు.  అయితే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన  150 మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ బ్లాక్ బస్టర్ అయ్యింది.  ఆ తర్వాత తీసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో వివినాయక్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు కూడా జంకుతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ వచ్చింది.  అప్పటి నుంచి ఈ దర్శకుడి సినిమాలు ఏవీ రాలేదు.  ఈ మద్య వివివినాయక్ హీరోగా నటించబోతున్నట్లు ఓ టాక్ కూడా ఫిలిమ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.  అంతే కాదు దానికి సంబంధించి వినాయక్ ఫిజిక్ మార్పులతో కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి. 

అయితే బాలకృష్ణతో ఓ మూవీ ఉండబోతుందని మాత్రం ఇటీవల టాక్ వినిపించింది...ప్రస్తుతం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు.  ఇక నేను శైలజా సినిమా తర్వాత హీరో రామ్ పోతినేనికి ఏ సినిమా కూడా కలిసి రాలేదు. వరుసగా డిజాస్టర్ టాక్ రావడంతో కెరీర్ ఇబ్బందుల్లో పడుతున్న సమయంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఈ మద్య ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ మూవీ మాస్ హిట్ కావడమే కాదు రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.  దాంతో రామ్ కి మంచి క్రేజ్ పెరిగింది..ఆయనతో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు ముందుకు వస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ 2 కి పూరి సిద్దమయ్యారు.  రామ్ కి  ఈ సినిమా తరువాత ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి వుంది.

ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. మళ్లీ మాస్ టచ్ వున్న పాత్రనే చేయాలనుకున్న రామ్, వీవీ వినాయక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అసలే మాస్ దర్శకుడు..ఈ మాస్ హీరోతో ఏ రేంజ్ మాస్ మూవీ తీస్తాడో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సినిమా మొదలుకావడానికి ఇంకా చాలా సమయం వుంది. అందువలన ఈ లోగా దర్శకుడిగా మరో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆయన రామ్ కి ఒక కథ వినిపించాడట. మాస్ మసాలా అంశాలు పుష్కలంగా వున్న ఈ కథ రామ్ కి బాగా నచ్చేయడంతో ఓకే చెప్పేశాడని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: