బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఏడో వారం కూడా పూర్తి చేసుకోబోతుంది. నేటితో సక్సెస్ ఫుల్‌గా ఏడు వారాలు పూర్తి చేసుకోనున్న ఈ బిగెస్ట్ రియాలిటీ షో లోకి  వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శిల్పా చక్రవర్తి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మొదటి వైల్డ్ కార్డ్ అంతగా ప్రభావం చూపని నేపథ్యంలో శిల్పా హౌస్లో ఏ విధంగా ముందుకు పోతుందో చూడాలి. ఇక గతవారం పూర్తిగా ఎలిమినేషన్ ని రద్దు చేసిన బిగ్ బాస్ ఈ వారం మళ్ళీ ఎలిమినేషన్ ని స్టార్ట్ చేసాడు. ఈ వారం మహేష్ , రాహుల్ , అలీ , రవి , శ్రీముఖి నామినేషన్స్ లో ఉన్న విషయం తెలిసిందే. వీరిలో రాహుల్ ని శనివారమే రాహుల్ సేఫ్ అయినట్టు ప్రకటించాడు.

ఇక సన్ డే ఈజ్ ద ఫన్ డే అంటూ ఈ రోజు ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ..హౌస్ మేట్స్ తో ఫన్నీ టాస్క్ ఆడించాడు. ఎప్పటిలాగే శనివారం హౌస్ మేట్స్ పై విరుచుకుపడిన నాగార్జున ..ఆదివారం వారితో చాలా ఆనందంగా గడిపాడు. ఆ తరువాత ఎలిమినేషన్ టైం దగ్గర పడటంతో టాస్క్ మధ్యలోనే ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. అందరూ ఈ వారం  మహేష్‌ లేదా రాహుల్‌ల్లో ఎవరో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని   భావించారు. కానీ ,  అలా భావించిన వారే వారికి ఓట్లు వేసినట్లు తెలుస్తుంది. 

ఇక ఈ వారం శ్రీముఖి కే ఎక్కువ శాతం ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మహేష్‌ మరియు రాహుల్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇక చివర్లో రవి , అలీ లు నామినేషన్స్ లో మిగలగా ... అందరిలోనూ టెంక్షన్ చాలా స్పష్టంగా కనిపించింది. ఇక వీరిద్దరిలో అలీ నువ్వు ఎలిమినేట్ అయ్యావు ..ప్యాక్ యువర్ బ్యాగ్ అంటూ చాలా కూల్ గా ఎలిమినేషన్స్ ని పూర్తి చేసాడు బిగ్ బాస్. మొదటివారం నుండి ఎలిమినేషన్స్ లోకి కూడా రాణి అలీ , వచ్చిన మొదటివారమే ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లడం అందరిని షాక్ కి గురిచేసింది.

హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ లో వన్ అఫ్ ది టైటిల్ ఫెవరెట్ అయిన అలీ ఇలా అనూహ్యంగా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి బయటకి రావడానికి ముఖ్యకారణం అలీ ప్రవర్తనే అని తెలుస్తుంది. నాగార్జున కూడా నువ్వు ఎలిమినేట్ అవుతావని అసలు ఊహించలేదు అని చెప్పాడు అంటే అర్థం చేసుకోవచ్చు అలీ ఎంతగా గేమ్ ఆడుతున్నాడో. ఏదేమైనా మనం ఊహించని విధంగా జరగడమే బిగ్ బాస్. మొత్తంగా తన కోపమే తనకి శత్రువుగా మారి చివరికి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లిపోయేలా చేసింది. అలీ ఎలిమినేట్ అని ప్రకటించగానే ... హౌస్ మేట్స్ అందరూ ఎంతో భాగోద్వేగానికి గురైయ్యారు. ముఖ్యంగా శివజ్యోతి కన్నీటిపర్యవంతం అయ్యింది


మరింత సమాచారం తెలుసుకోండి: