అందాల తార త్రిష సినీ కెరియర్ మొదలుపెట్టి దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన "నీ మనసు నాకు తెలుసు" ద్వారా పరిచయం అయ్యింది.ఆ సినిమా ఆమెకు విజయాన్ని అందించలేకపోయింది. ఆ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి నటించిన "వర్షం" సినిమా సుపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లోని అందరు టాప్ హీరోలతో నటించింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన "కట్టా మీటా" సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా అంతగా విజయం సాధించ లేదు. దాంతో బాలీవుడ్ ఆశలు అన్ని నీటిలో కలిసిపోయాయి.2018 లో తమిళంలో వచ్చిన 96 సినిమాలో విజయ్ సేతుపతి-త్రిష జంటగా నటించారు. 96 సినిమా ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమాను తెలుగులో శర్వానంద్-సమంత జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు
ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ఒక భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.తమిళ్-, తెలుగు-, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్నిస్తున్నారు . ఈ సినిమాలో త్రిషకు ఒక కీలక పాత్ర చేయబోతున్నారని చెన్నై సినీ వర్గాల సమాచారం.ఈ సినిమా ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ప్రముఖ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా రూపోందుతోంది.
త్రిష ఈ సినిమాలో ఒక రాణి పాత్ర చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్ మాత్రమే ఫైనలైజ్ అయ్యారు. పొన్నియిన్ సెల్వన్’ సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది.ఈ డిసెంబర్ లో సినిమా షూటింగ్ మొదలవుతుంది. మద్రాస్ టాకీస్, – లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.