సూపర్ స్టార్ రజనీ కాంత్ కి అభిమానులు ఎక్కువే. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అందుకే ఆయన సినిమాలు ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం బాగుంటాయి. నిజం చెప్పాలంటే రజనీకి సరైన సక్సెస్ రాలేదు. అయినా ఆయన పాపులారిటీ ఇసుమంతైనా తగ్గలేదు. ఇండియాలోనే ప్రపంచ వ్యాప్తంగా ఆయన సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అదీ కాకుండా ప్రస్తుతం సినిమాల పరిధి బాగా పెరిగింది.


ఎక్కడ తీసిన సినిమా అయినా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్నాయి. కంటెంట్ బాగుంటే అంతటా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన 2.O చిత్రం చైనాలో విడుదల అయింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం చైనాలో మంచి టాక్ తో దూసుకుపోతుంది. సెప్టెంబరు ౬ న విడుదల అయిన్ ఈ చిత్రం మొదటిరోజు తొమ్మిది నుండి 10 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది.


ఈ సినిమాని భారీ ఎత్తున 48 వేల స్క్రీన్లలో విడుదల చేయడం జరిగింది. చైనాలో ఇన్ని థియేటర్లలో విడుదల అవడం చిన్న విషయం కాదు. నిజానికి 2.O ఎప్పుడో విడుదల కావాల్సివుండగా ది లయన్ కింగ్ విడుదల కారణంగా ఈ చిత్ర విడుదల వాయిదా వేయడం జరిగింది. ఇండియాలో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లనే సాధించింది. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది.


గతంలో ఆమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం చైనాలో రికార్డు స్థాయిలో వసూళ్ళు సాధించింది. బాహుబలి కూడా డీసెంట్ కలెక్షన్లు రాబట్టింది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసుని షేక్ చేసిన అంధాధున్ సినిమాకి చైనాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు రజనీ 2.O కూడా ఆ దిశగా వెళ్తుందో లేదో చుడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: