శృతిహాస‌న్, ర‌వితేజ‌కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంది శృతి హాస‌న్. ఎందుకో తెలియ‌దు కానీ మెల్ల‌మెల్ల‌గా సినిమాల నుంచి దూరం అయిపోతుంది ఈ భామ‌. రెండేళ్లుగా సినిమాలు ఒప్పుకోవ‌డ‌మే మానేసింది ఈ ముద్దుగుమ్మ‌. పూర్తిగా న‌ట‌న మానేసి సంగీతం వైపు అడుగేస్తుంది శృతిహాస‌న్. సినిమాల్లోకి రాక‌ముందే ఈమె గాయ‌కురాలిగా పేరు తెచ్చుకుంది. క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన ఈనాడు సినిమాకు సంగీత ద‌ర్శ‌కురాలిగా కూడా ప‌ని చేసింది. ఇక సినిమాలు మానేసి.. హాయిగా రాక్‌స్టార్‌గా ఫిక్స్ అయిపోవాల‌ని ఆ మ‌ధ్య ఫిక్సైపోయింది శృతి హాస‌న్.


ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా 'డిస్కోరాజా' చిత్రం రూపొందుతోంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. మాస్ ఆడియన్స్ కి తమ గ్లామర్ తో మంత్రం వేసే పాయల్ .. నభా నటేశ్, ఈ సినిమాలో ఒక రేంజ్ లో గ్లామర్ ఒలకబోయనున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతిహాసన్ ను తీసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. ఆమె అంగీకరించే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'బలుపు' విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.


సాహో లాంటి సినిమాను కూడా ముందు శృతినే అడిగినా ఆమె కాదంద‌ని టాక్ ఉంది ఇండ‌స్ట్రీలో. అందాల ఆరబోత‌లో ర‌ప్ఫాడించే ఈ ముద్దుగుమ్మ ఉన్న‌ట్లుండి ఇలా సినిమాల నుంచి త‌ప్పుకోవ‌డం అభిమానుల‌కు షాకే. అయితే ఇప్పుడు మాత్రం బాయ్ ఫ్రెండ్ మైఖెల్ కోర్సెల్‌తో విడిపోయిన త‌ర్వాత వ‌ర‌స సినిమాల‌కు సైన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. చిరంజీవి, కొర‌టాల శివ సినిమాలో శృతినే హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ట్రై చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: