టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా  'అల వైకుంఠపురంలో' అనే సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే సినిమాని త్వరగా కంప్లీట్ చేయాలని ముందుగా డైరెక్టర్ కి అల్లు అర్జున్ సూచించడం తో సినిమా షూటింగ్ త్వరగా మొదలు పెడుతున్న సందర్భంలో సెట్లోకి టైంకి హీరోయిన్ పూజా హెగ్డే రావటం లేదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సినిమా యూనిట్ మొత్తం షూటింగ్ కి వచ్చినా గాని టైంకి పూజా హెగ్డే రాకపోవడంతో చాలా వరకు షూటింగ్ ఆలస్యంగా స్టార్ట్ అవడంతో అనుకున్న సమయానికి సినిమా విడుదల అవుతుందో లేదో అని సినిమా నిర్మాతలు మరియు డైరెక్టర్ త్రివిక్రం తెగ టెన్షన్ పడుతున్నట్లు ఫిలిం నగర్లో టాక్.


ముఖ్యంగా పూజాహెగ్డే వ్యవహరిస్తున్న తీరు డైరెక్టర్ త్రివిక్రమ్ కి తలపోటుగా మారినట్లు సినిమా యూనిట్ చేస్తున్న కామెంట్. నా పేరు సూర్య వంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న 'అల వైకుంఠపురంలో' సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని మంచి కసి మీద పని చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దారుణమైన ఫ్లాప్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో మంచి హిట్ అందుకొని తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే ఆలోచన లో ఉన్నారు.


ఇటువంటి నేపథ్యంలో సినిమా షూటింగ్ కి ఆలస్యంగా నటీ నటులు రావడంతో 'అల వైకుంఠపురంలో' సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా లేదా అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో   రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్ వంటి తారలు సెట్స్ కి లేట్ గా వెళ్తూ దర్శకులను ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. ఇటువంటి నేపథ్యంలో కొన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ విధంగా వ్యవహరించడం దారుణమని సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు.  

 



మరింత సమాచారం తెలుసుకోండి: