సీనియర్ హీరోలుగా గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వెంకటేష్ నాగార్జునలు ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినా తమ క్రేజ్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో వెంకటేష్ ఓకె చెప్పిన ఒక సినిమాకు నాగార్జున ఇమేజ్ శాపంగా మారి ఆఖరి నిముషంలో ఈ మూవీ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

అజయ్ దేవగణ్ టబు రకుల్ ప్రీత్ కలిసి నటించిన ‘దేదే ప్యార్ దే’ బాలీవుడ్ లో మంచి హిట్ సాధించింది. పెళ్ళి అయి భార్యకు దూరంగా ఉన్న ఒక 50 సంవత్సరాల వ్యక్తి ఒక అమ్మాయి ప్రేమలో పడిన కథ ఇది. ప్రతిసీన్ లోను హాస్యం ఉండటంతో ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. 

దర్శకుడు శ్రీ వాస్ ఈ మూవీని తెలుగులోకి రీమేక్ చేయాలని వెంకటేష్ అంగీకారం తీసుకుని ఈ మూవీ స్క్రిప్ట్ కూడ పూర్తి చేసినట్లు టాక్. వెంకటేష్ కూడ ఈ మూవీ చేయాలి అని ఉత్సాహపడి చివరి నిముషంలో ఈ మూవీని వదులుకోవడానికి గల కారణం నాగార్జున ‘మన్మధుడు 2’ ఎఫెక్ట్ అని అంటున్నారు. ఈ మూవీలో 60 సంవత్సరాల వయస్సు ఉన్న నాగార్జున రకుల్ ప్రీత్ తో చేసిన హాట్ రొమాంటిక్ సీన్స్ పై సెటైర్లు పడటంతో పాటు ఆ మూవీ ఘోరంగా ఫెయిల్ అయింది. 

దీనితో తాను కూడ ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఉన్న ‘దేదే ప్యార్ దే’ రీమేక్ లో నటిస్తే తన సినిమాకు ‘మన్మధుడు 2’ లాంటి రిజల్ట్ తో పాటు అనవసరపు సెటైర్లు ఎదురౌతాయని వెంకటేష్ ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని శ్రీ వాస్ ను మరో హీరోను వెతుక్కోమని చెప్పినట్లు టాక్. దీనితో ప్రస్తుతం సినిమాలు లేక బాధ పడుతున్న శ్రీ వాస్ కు ‘మన్మధుడు 2’ శాపంగా మారిందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: