అంత్యంత భారీ అంచనాలతో రాబోతున్న సంక్రాంతి రేస్ కు వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి ఇప్పటి వరకు అన్నీ పాజిటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ మూవీకి తమన్నా నెగిటివ్ సెంటిమెంట్ వెంటాడటం మహేష్ అబిమానులను కలవర పరుస్తోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో తమన్నాతో ఒక స్పెషల్ సాంగ్ ను దర్శకుడు అనీల్ రావిపూడి డిజైన్ చేసినట్లు టాక్. ఈ పాట ఈ మూవీ ఇంట్రడక్షన్ సీన్స్ లో వస్తుందని సమాచారం. పూర్తి మాస్ అప్పీల్ తో ఉండే ఈ పాటలో మహేష్ పక్కన తమన్నా అయితే బాగుంటుందని ఈ మూవీ దర్శక నిర్మాతలు ఏరికోరి తమన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

త్వరలోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసే ఒక భారీ సెట్ లో ఈ స్పెషల్ సాంగ్ తీయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ న్యూస్ మహేష్ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. దీనికి కారణం తమన్నా స్పెషల్ ఐటమ్ సాంగ్స్ చేసిన చాల సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారాయి.

దీనికితోడు మహేష్ తమన్నాలు కలిసి నటించిన ‘ఆగడు’ సినిమా కూడ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. ఇలాంటి పరిస్థితులలో మహేష్ కు ఏమాత్రం సెంటిమెంట్ గా కలిసిరాని తమన్నాను మళ్ళీ ఎందుకు తీసుకు వస్తున్నారు అంటూ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. సినిమాల జయాపజయాలు అన్నీ సెంటిమెంట్ పై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ న్యూస్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని భారీ మొత్తాలకు కొనుక్కుంటున్న బయ్యర్లకు కు కూడ కలవర పెట్టే  విషయం. అయితే సెంటిమెంట్స్ బాగా పట్టించుకునే మహేష్ తమన్నాకు ఎలా ఓటు వేసాడు అన్నది అర్ధం కాని విషయంగా మారింది అనుకోవాలి..
 


మరింత సమాచారం తెలుసుకోండి: