బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా 50 రోజులని పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు చాలా ఆసక్తిగా సాగిన బిగ్ బాస్ ప్రయాణం ..ఇకపై అంత సులభం కాకపోవచ్చు అని అందరికి తెలిసిందే. ఈ బిగ్ బాస్ హౌస్లో మొదటి 50 రోజులు ఒక ఎత్తు అయితే..చివరి 50 రోజులు మరో ఎత్తు. సండే ఈజ్ ద ఫండే అంటూ జింగిడి జింగిడి పాటతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. మన టీవీ ద్వారా హౌస్‌మేట్స్‌ని పలకరించారు. 50 ఎపిసోడ్ సందర్భంగా షో ప్రారంభం నుంచి 50 రోజుల హౌస్ మేట్స్ ప్రయాణాన్ని టీవీలో వేసి చూపించారు.

ఆ తరువాత  స్పెషల్ గెస్ట్ నానీని మంచి ఊపున్న పాటతో నాగార్జున ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు.  ఇక  నా...ని టీవీ ద్వారా హౌస్‌మేట్స్‌ని పలకరించారు. నేచురల్ స్టార్‌ని నానీలా కాకుండా పెన్సిల్ పార్థసారధిగా హౌస్ మేట్స్ కి  నాగార్జున పరిచయం చేశారు. ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగా పెన్సిల్‌కి పరిచయం చేసుకోండని చెప్పారు. బాబా భాస్కర్‌తో పరిచయ కార్యక్రమం మొదలుపెట్టారు. మై నేమ్ ఈజ్ భాస్కర్ ఐ లవ్ కామెడీ.. ఇలా అందరూ తమకు ఇష్టమైనదేంటో చెప్తూ పరిచయం చేసుకోవాలని చెప్పారు. ఆ తరవాత నాని తాను ఒక స్క్రిప్ట్ అనుకొని అందులోని ఒక్కో పాత్రను ఒక్కో హౌస్‌మేట్‌కి ఇచ్చేశారు.

ఇలా అందరికీ ఒక్కో రోల్ ఇచ్చేసిన తరవాత గ్యాంగ్ లీడర్ ట్రైలర్‌ను బిగ్ బాస్ ఇంటిలో ఉన్నవారందరికీ  చూపించారు.  సూపర్ అంటూ నానికి చెప్పారు.  నానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ, నాగార్జున మాత్రం ట్రైలర్‌లో తనకు రొమాన్స్ తక్కువగా కనపడుతోందన్నారు. ఇలాంటివి నాగ్ సారే నోటీస్ చేస్తారంటూ నాని నవ్వించారు. ఆ తరవాత నాగార్జున ఎడమ చేతిపై వేయించుకున్న టాటూను నాని రివీల్ చేశారు. అనంతరం అందరికీ బైబై చెప్పి వెళ్లిపోయారు.

ఇక ఆ తరువాత హౌస్లో    ఏడుపులు మొదలైయ్యాయి. దీనికి కారణం ఎలిమినేషన్. నామినేషన్‌లో ఉన్న అలీ, శ్రీముఖి, రవి, మహేష్‌లను నాగార్జున యాక్టివిటీ రూంలోకి వెళ్లమన్నారు. అక్కడ నలుగురిని వరుసగా నిలబెట్టి లైట్ ఎవరి మీద పడితే వారు సేఫ్ అని చెప్పారు. మొదట లైట్ శ్రీముఖి మీద పడింది. ఆ తరవాత లైట్ ఎవరి మీద పడితే వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. ఆ సమయంలో  లైట్ అలీ మీద పడింది.

దీనితో  అందరూ షాక్. శివజ్యోతి, హిమజ, శ్రీముఖి ముఖాల్లో ఆశ్చర్యం. వాళ్లు నమ్మలేదు. కానీ, నాగార్జున.. అలీ యు ఆర్ ఎలిమినేటెడ్ అనగానే శివజ్యోతి ఏడుపు మొదలుపెట్టింది. శ్రీముఖి అలీకి ఎదురెళ్లి గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. వరుణ్ సందేశ్, శివజ్యోతి, రవి, రాహుల్, బాబా భాస్కర్ అందరూ అలీని హత్తుకుని ఏడ్చేశారు. ఆ తరవాత అలీ ఇంట్లో నుంచి బయటికి వచ్చి నాగార్జునను కలిశాడు.

అయితే, ఇంటి సభ్యులతో మారుసారి మాట్లాడే అవకాశాన్ని అలీకి నాగార్జున ఇచ్చారు. టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇంటి సభ్యులతో మాట్లాడించారు. చాలా మంది ఏడుస్తూనే అలీతో మాట్లాడారు. అందరితో నవ్వుతూ మాట్లాడిన అలీ.. బాబా భాస్కర్ మాట్లాడినప్పుడు మాత్రం ఎమోషన్‌ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తానూ ఏడ్చేశారు. మొత్తం మీద గుండె నిండా బాధతో బయటికి సంతోషం నటిస్తూ అలీ బిగ్ బాస్ షో  నుండి బయటకి వెళ్ళిపోయాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: