తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 రియాల్టీ లైవ్ షో నిన్నటితో ఏడోవారం ముగిసింది. ఇప్పటికే రెండు సీజన్లు ముగించుకొని మూడో సీజన్ నడుస్తుంది. గత సీజన్లకు ఎన్టీఆర్, నానీ హూస్ట్ గా వ్యవహరించారు. ఈసారి అక్కినేని నాగార్జున బిగ్ బాస్ 3 కి హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారి చాలా ప్రశాంతంగా జరుగుతుంది. గతంలో జరిగిన బిగ్ బాస్ సీజన్ 1, 2 ఎన్నో కాంట్రవర్సీలతో ప్రతిరోజూ ఏదో ఒక సెన్సేషన్ ఉండేది..కానీ ప్రస్తుతం వస్తున్న బిగ్ బాస్ 3 మాత్రం చాలా హ్యాపీ హ్యాపీగా సాగిపోతుంది. ముఖ్యంగా ఇంటి సభ్యుల మద్య ఎలాంటి భేదాభిప్రాయాలు, గొడవలు, గ్రూపులు లేకుండా సాగుతుంది.
కాకపోతే బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ సమయంలో మాత్రం ఇంటి సభ్యుల మద్య నువ్వా..నేనా అనే రేంజ్ లో పోటీ నెలకొంటుంది. ఆ సమయంలో కొన్ని మాటలు కూడా స్లిప్ అవుతున్నారు. ఇలా రెండు సార్లు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ క్యాన్సల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నిన్నటి ఎపిసోడ్ మొదట చాలా సంతోషంగా సాగింది. నేచురల్ స్టార్ నాని నిన్న స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.
గతంలో ఆయన బిగ్ బాస్ కి హూస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక నాని వెళ్లి పోయిన తర్వాత బిగ్ బాస్ ఎలిమినేషన్ రౌండ్ లో అలీ రజా ఔట్ కావడంతో అందరూ షాక్ తిన్నారు. ఇక ఇంటి సభ్యుల కన్నీరు మామూలుగా పెట్టుకోలేదు. ముఖ్యంగా తీన్మార్ సావిత్రి(శివజ్యోతి) అయితే ఎక్కి ఎక్కి ఏడ్చింది. తర్వాత శ్రీముఖి ఇలా అందరూ కన్నీటి పర్యంతం అయ్యారు..ఈ సీన్ చూస్తున్న ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టుకున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి బిగ్ బాస్ చాలా బాధ అనిపించింది.