అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సాధించడంతో పాటు తెలుగులో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ సినిమా ద్వారా విఇజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. శివ సినిమా తర్వాత అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీ అర్జున్ రెడ్డినే అంటే అతిశయోక్తి కాదేమో! దేశం మొత్తం మనవైపు చూసేలా చేసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి కూడా ఒకటి.
అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ తో పని చేయడానికి స్టార్ హీరోలు సైతం ఎదురు చూశారు.కానీ అతను టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుని అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్గా హిందీలో తీసే పనిలో పడిపోయాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ అయింది. 250 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోయింది. సందీప్కు బాలీవుడ్లోనూ చాలా మంచి పేరొచ్చింది.
కబీర్ సింగ్ తర్వాత సందీప్ తెలుగులో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. మహేష్ బాబుతో సినిమా ఉంటుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే కబిర్ సింగ్ విజయం తర్వాత సందీప్ బాలీవుడ్ లో మరీ చేయాలని డిసైడ్ అయ్యాడట. అంతేకాక సందీప్ నిర్మాణంలో బాలీవుడ్ లో అతని అసిస్టెంట్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమా నిర్మించిన తర్వాత బాలీవుడ్ లో మరో సినిమా డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయట.
అంటే ఇంకో రెండేళ్ళ పాటు సందీప్ తెలుగులో దర్శకత్వం చేసే అవకాశం కనిపించట్లేదు. దీంతో సందీప్ ఇక ముంబయిలో సెటిల్ అయిపోయినట్లేననే వార్తలు వస్తున్నాయి. మరి అక్కడే ఉంటాడా? లేదా మళ్ళీ తెలుగులో సినిమాలు చేస్తాడా లేదా చూడాలి. సందీప్ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారనేది మాత్రం వాస్తవం.