వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలతో అదిరిపోయే రెండు హిట్లు అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవరు’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. కర్నూల్, జమ్మూకాశ్మీర్ వంటి ప్రాంతాలలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో ఆర్మీ జవాన్ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు. అయితే కామెడీ బేస్ పరంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి పనితనం మహేష్ బాబు కి బాగా నచ్చిందట.


దీంతో 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ సెట్లో ఉన్న సమయంలోనే మహేష్ బాబుకి మరో స్టోరీని అనిల్ రావిపూడి వినిపించాడట. దీంతో వెంటనే ఓకే చెప్పేశాడట మహేష్. ఈ సినిమా అయిన వెంటనే కాకుండా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత వేరొక సినిమా చేసి తర్వాత మళ్లీ అనిల్ రావిపూడి తో చేయాలని మహేష్ బాబు డిసైడ్ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


మహేష్ బాబు ఈ సారి ఎలాగైనా అనిల్ రావిపూడి తో ప్రస్తుతం చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో ఉన్నాడట. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు విజయశాంతి నటించడంతో రి ఎంట్రీ ఇవ్వడం తో సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో విజయశాంతి లెక్చరర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు-అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్కు ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. సంక్రాంతికి హంగామా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: