సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హిట్ డైరెక్టర్లకు మాత్రమే అవకాశాలు ఇస్తారని ఇటీవల చాలామంది ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కామెంట్లు చేయడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు సినిమాలను సెలెక్ట్ చేసుకునే దాని విషయమై మహేష్ బాబు అభిమానులకు ఇతరులకు చాలా వాగ్వివాదాలు జరుగుతున్నాయి ఒక్కోసారి పరిస్థితి విషమించి మహేష్ అభిమానులకు కూడా చికాకు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా తన సినిమా సెలెక్ట్ చేసుకోకా ముందు భార్య నమ్రతతో డిస్కషన్ చేసి చెట్లు అడుగుపెడతారు ఓకే చెబుతారని టాక్ ఉంది.


ఇటువంటి నేపథ్యంలో మహేష్ బాబు భార్య నమ్రత ఇటీవల ఓయ్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు స్టోరీ ఎలా సెలెక్ట్ చేసుకుంటాడో అన్న దాని విషయమై క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తన ఒప్పుకున్న సినిమా ద్వారా ఎవరు నష్టపోకూడదని ఎక్కువగా ఆలోచించేవారిలో మహేష్ ఒకరు. అందుకే ప్రిన్స్ సెలెక్ట్ చేసుకునే కథల విషయంలో నలుగురిని అడిగి గాని ఒక నిర్ణయం తీసుకోడని  ఆయన సతీమణి నమ్రత పాత్ర కూడా ఉంటుందని మరో పాజిటివ్ టాక్ కూడా ఉంది.


మొత్తంమీద మహేష్ ఒప్పుకునే సినిమాలకు తన ప్రమేయం ఉండాలని తెలిపింది. అదేవిధంగా భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయంలో కూడా తనతో ఎక్కువగా డిస్కషన్ మహేష్ బాబు చేయాలని తన నిర్ణయమే ఫైనల్ నిర్ణయమని నమృత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నమ్రత 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు. మేజర్ అనే టైటిల్ సెట్ చేసిన ఆ మూవీలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. మరో పక్క మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: