అయన  ఓ పోకిరి ... తర్వాత దూకుడు చూపించి పోలీస్ గా మారి...తర్వాత సీఎం అయ్యి ...ఆ తర్వాత మహర్షిలా మారిపోయాడు . అయన ఎవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు . వరుస   విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. . తన సినిమా హిట్ల తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొడుతున్నాడు  . సినిమా సినిమాకి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు . మొన్నటి వరకు  భరత్ అనే నేను లో సీఎం గా ... నిన్నటి వరకు ఓ మహర్షి గా...ఇక ఇప్పుడు ఓ సైనికుడిలా సరిలేరు నీకెవ్వరూ అంటూ మన ముందుకు రాబోతున్నాడు మహేష్ బాబు .


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అని రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ లో ఓ ఆర్మీ మ్యాన్ గా మహేష్ డిఫెరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు .కాగా మహేష్ కి జోడిగా రష్మిక మందన్న మెరవబోతుంది . ఈ చిత్రాన్ని దిల్ రాజు , అనిల్ సుంకర నిర్మిస్తున్నారు . కాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న కొద్దీ కొత్త కొత్త నటులు ఇందులో బాగమవుతూనే ఉన్నారు 


 .
మొన్నటి వరకు విజయ శాంతి ఈ సినిమాలో భాగం అవ్వగా ... ఇక ఇప్పుడు మరో హీరోయిన్ ఈ సినిమాలో నటించ బోతుంది . ఇంతకీ ఆ హీరొయిన్ ఎవరు అనుకుంటున్నారా ... మిల్కీ బ్యూటీ తమన్నా . తమన్నా ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో మెరవబోతుంది .ఇప్పటికే పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ తో కుర్రకారును ఉర్రుతలూగించిన ఈ బ్యూటీ ...ఇప్పుడు మరో సారి ఐటెం సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . కాగా ఈ ఐటెం సాంగ్ కోసం మొదటి శృతి హాసన్ ని సంప్రదించగా ... చివరికి తమన్నా ఈ అవకాశాన్ని దక్కించుకుంది .ఈ ఐటెం సాంగ్ కోసం తమన్నాకి భారీ పారితోషకమే ఇస్తున్నారట . కాగా  మహేష్ బాబు, తమన్నా ఆగడు సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసందే . 


మరింత సమాచారం తెలుసుకోండి: