లోకి కెరటం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో మంచి పేరు సంపాదించింది.  మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రకూల్ ప్రీత్ సింగ్ కెరటం సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. 

 ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తుంది.  తెలుగు లో నటిస్తున్న హీరోయిన్లు తమ సినిమా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు పడుతుంటారు. తాజాగా హాట్ బ్యూటీ రకూల్ కి విపరీతమైన కోపం వచ్చిందట. సాధారణంగా ఏదైనా ఈవెంట్స్ జరిగితే అది పూర్తయ్యే వరకు ఎంతో ఓపికతో ఉంటారు..సీనీ నటులు. నిన్నటి రాత్రి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ (మేనేజర్స్) రజతోత్సవ ఈవెంట్ నుంచి అందాల రకుల్ ప్రీత్ సింగ్ కోపంతో మధ్యలోనే వెళ్లిపోయిందట.

అసలు విషయానికి వస్తే.  నిన్నటి రాత్రి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ (మేనేజర్స్) రజతోత్సవ  కార్యక్రమంలో పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, చిన్నజీయార్ స్వామి,రెబల్ స్టార్ కృష్ణం రాజు,  ఎస్వీ కృష్ణా రెడ్డి, అల్లు అరవింద్ ..పెద్ద పెద్ద వక్తలంతా వేదికను షేర్ చేసుకుని తమ అమూల్యమైన స్పీచ్ లతో అదరగొట్టారు. ఇదే సమయంలో స్టేజ్ పై స్టేజీపై పూజా హెగ్డే, రాశీఖన్నా,అనసూయచ,  దేవీశ్రీ  వీళ్లంతా ఓవైపు లైవ్ పెర్ఫామెన్సెస్ తో దుమ్ము దులిపారు. ఇదే షోలో రకూల్ లైవ్ షో కూడా ఇవ్వాల్సి ఉన్నా తన టైమ్ మాత్రం సాగదీస్తూ వచ్చారట.

అదే సమయంలో  ఒక్కొక్కరూ తమదైన స్పీచ్ లతో ఆడియన్స్ ని అలరిస్తున్నారట.   అది కాస్తా టైమ్ తినేయడంతో రకుల్ కి ముక్కు మీద కోపం పొడుచుకొచ్చిందట. చాలా సేపు ఎదురు చూసి చూసి ఇక లాభం లేదనుకుని నిర్వాహకులకు కూడా చెప్పకుండా అక్కడి నుంచి  రుసు రుసలాడుకుంటూ వెళ్లిపోయిందట. సాటి హీరోయిన్లు తమ వంతు టైమ్ వచ్చే వరకు వెయిట్ చేసి పర్ఫామెన్స్ ఇచ్చారట. పూజా హెగ్డే, రాశీ ఖన్నా పెర్ఫామెన్సులు ఇచ్చారుగా.. కానీ రకుల్ మాత్రం సహనం కోల్పోయిందని చెప్పుకుంటున్నారు.  భారీ అవార్డుల వేడుకల సమయంలో అయితే అసలు సెలబ్రిటీకి కుర్చీ వేయడమే కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు. అలాంటిది రకూల్ ఇంత సహనం కోల్పోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: