మెగాస్టార్ చిరంజీవి హీరోగా 151వ సినిమాగా వస్తున్న సినిమ సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత డైరక్టర్ సురేందర్ రెడ్డి ఎవరితో చేస్తాడో ఇంకా క్లారిటీ రాలేదు.


అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం డైరక్టర్ సూరి సైరా తర్వాత సాహో హీరో ప్రభాస్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. రీసెంట్ గా ప్రభాస్ ను కలిసి సురేందర్ రెడ్డి లైన్ వినిపించాడట. లైన్ నచ్చిన ప్రభాస్ డెవలప్ చేసుకుని రమ్మన్నాడట. సాహో సినిమా హడావిడిలో ఉన్న ప్రభాస్ కొద్దిరోజుల్లో రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న జాన్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.    


2020 సమ్మర్ లో జాన్ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లోనే సినిమా చేస్తాడని అంటున్నారు. సైరా సినిమా టీజర్ తో సూరి తన సత్తా ఏంటో చూపించగా అంత భారీ బడ్జెట్ ను హ్యాండిల్ చేయడంలో సక్సెస్ అయితే సైరా తర్వాత సురేందర్ రెడ్డికి కూడా ఇక మీదట భారీ బడ్జెట్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది.


సాహోతో మరోసారి నేషనల్ వైడ్ గా తన స్టామినా ప్రూవ్ చేసుకున్న ప్రభాస్ జాన్ సినిమాను కూడా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. జాన్ తర్వాత ప్రభాస్ సూరితో చేస్తాడా లేక మరెవరికైనా ఓకే చెబుతాడా అన్నది తెలియాల్సి ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో ప్రభాస్ జాన్ తెరక్కిస్తుండగా ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: