టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ తరహా పాత్రలే చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్మీకి సినిమాలో మాత్రం గని అలియాస్ గద్దలకొండ గణేష్ అనే ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ లో నటిస్తూ మెగా ఫ్యాన్స్ ను ఖుషి చేయనున్నాడు. వరుణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు సాంగ్స్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి, వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. జిగర్తాండ అనే తమిళ సినిమా అఫీషియల్ రీమేక్ గా తెరేకేక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు అయనాంక బోస్ కెమెరా మాన్ గా వ్యవహరిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి అద్భుతమైన వ్యూస్ తో దూసుకుపోతోంది. 'ఈ మధ్య కాలంలో ఇంటిల్లిపాది చూసే సినిమాలు ఎక్కడ వస్తున్నాయి' అంటూ కొందరు ముసలి ఆడవాళ్ళు చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ లో 'మనం వెతకాల్సింది 'ఫామ్ హౌస్ లో ఉన్న డాన్ ని కాదు, ఫామ్ లో ఉన్న గ్యాంగ్ స్టర్ ని', అంటూ నటుడు అథర్వ మురళి పలికే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. 

ఇక 'నా పైన పందాలేస్తే గెలుస్తారు, నాతోటి పందాలేస్తే చస్తారు' 'ఒట్టి గీతలే మన చేతిలో ఉంటాయి, రాతలు మన చేతిలో ఉండవు' అంటూ హీరో వరుణ్ తేజ్ పలికే పవర్ఫుల్ డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ ట్రైలర్ కు మరొక ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. మంచి యాక్షన్ సీన్స్ తో పాటు, లవ్ మరియు ఎమోషనల్ గా సాగిన ఈ వాల్మీకి ట్రైలర్, సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. మరి ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, ఎంతవరకు ఆ అంచనాలు అందుకుంటుందో వేచి చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: