నేషనల్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ..భారీ ఎత్తున గత నెల 30 న అభిమానుల ముందుకు వచ్చింది. భారీ ఎక్సపెక్టేషన్స్ తో వచ్చిన ఈ సాహో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకి పైగా కలెక్ట్ చేసి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి రుచిచూపిస్తుంది. బాహుబలితో నేషనల్ హీరోగా ఎదిగిన ప్రభాస్ ఈ సినిమాతో ఆ ఇమేజ్ ని మరింతగా పెంచుకున్నాడు అని చెప్పాలి. బాహుబలి తరువాత వచ్చే సినిమా కావడంతో ..ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సాహో ని యువీ క్రియేషన్స్ వారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. 
హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఆలిండియా లెవల్లో హైప్ అందుకున్న సాహో లో  ప్రభాస్ సరసన  శ్రద్ధా కపూర్ జంటగా నటించింది. అలాగే  ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ సాహో కి తొలిరోజే డివైడ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభాస్ స్టార్ ఇమేజ్ ముందు ఆ డివైడ్ టాక్ కూడా ఏమిచేయలేకపోయింది. తాజాగా ఈ సాహో సినిమాని  ప్రభాస్  హైదరాబాద్ లోని సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్‌లో చూసారు. మధ్యాహ్నం 12 గంటల షో చూడటానికి ప్రభాస్ గచ్చిబౌలిలో ఉన్న ఏఎంబీ థియేటర్స్‌కు వెళ్లారు. 
ఎలాంటి హంగామా లేకుండా పార్కింగ్ స్థలం నుంచి వీఐపీ లిఫ్ట్‌లో థియేటర్‌ లోపలికి వెళ్ళిపోయాడు. థియేటర్ యజమాన్యాయానికి రెబల్ స్టార్ వస్తున్నాడని ముందే తెలియడంతో ... వెల్కమ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేసారు. ప్రభాస్ వస్తున్నారని ఫ్యాన్స్ అసోసియేషన్స్ కి ముందే తెలిసినా కూడా గచ్చిబౌలి రూట్‌లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దని ప్రభాస్ సన్నిహితులు అభిమానులకి చెప్పినట్టు తెలుస్తుంది. దీనితో ప్రభాస్ రాబోతున్నారన్న వార్తలు బయటికి రాకపోవడంతో థియేటర్ వద్ద ఎలాంటి హంగామా లేదు.అలాగే మహేష్ బాబు థియేటర్ లో రెబల్ స్టార్  ప్రభాస్ సినిమా చూడటం ఇదే మొదటిసారి.


మరింత సమాచారం తెలుసుకోండి: