ఒకటి కాదు రెండు కాదు..వరుసగా నాలుగైదు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఉక్కిరి బిక్కిర అయ్యాడు టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్.  లౌక్యం సినిమా తర్వాత వరుస డిజాస్టర్లతో కెరీర్ చాలా ఇబ్బందిలో పడిపోయింది.  దాంతో తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు గోపిచంద్. తెలుగు తెరపై యాక్షన్ హీరోగా గోపీచంద్ కి మంచి పేరుంది.  ప్రముఖ విప్లవ దర్శకుడు టి.కృష్ణ తనయుడు గోపిచంద్. 

రష్యాలో చదువు ముగించుకొని ‘తొలివలపు’ సినిమాతో తన నట ప్రస్థానమును ప్రారంభించి నప్పటికీ ఆ సినిమా ఆశించినంత ఫలితం రాలేదు. దాతంతో విలన్ అవతారం ఎత్తాడు..జయం, వర్షం, నిజం లాంటి సినిమాల్లో నటించిన నెగిటీవ్ పాత్రలకు గోపిచంద్ కి మంచి పేరు వచ్చింది.  ఆ తర్వాత రణం, యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం నిమాల్లో హీరోగా నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు. నటుడు శ్రీకాంత్ సోదరి కూతురు రేష్మా ను వివాహం చేసుకున్నాడు. వీరికి విరాట్ కృష్ణ అనే అబ్బాయి. 

ఇటీవల గోపిచంద్ నటించిన సౌఖ్యం, గౌతం నంద, ఆక్సీజన్,ఆరడుగుల బుల్లెట్, పంతం వరుస డిజాస్టర్స్ అయ్యాయి.  తాజాగా గోపిచంద్, తమిళ దర్శకుడు 'తిరు' దర్శకత్వం ‘చాణక్య'లో ఆయన 'రా' ఏజెంట్ గా నటిస్తున్నాడు.  తీవ్రవాదానికి,  దేశభక్తికి సంబంధించిన విజువల్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.

ఈ మద్య దేశ భక్తికి సంబంధించిన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.  ఈ సినిమాలో గోపీచంద్ జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో, జరీన్ ఖాన్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. కొంతకాలంగా సక్సెస్ కోసం గోపీచంద్ చేస్తోన్న నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: