హెబ్బా పటేల్ పరిచయం అక్కరకు లేని పేరు . 21 ఎఫ్ సినిమా ద్వారా కుర్రకారు మతిని పోగొట్టింది హెబ్బా పటేల్ .ఈ సినిమా తరువాత హెబ్బా పటేల్ కెరీర్ పిక్ కు చేరుకుంటుందని సినీ విశ్లేషకులు భావించారు . కానీ 24 కిస్సెస్ చిత్రం తరువాత ఈ ముంబయి బ్యూటీ కి పెద్దగా అవకాశాలు లభించలేదు . దానికి తోడు హెబ్బా కాసింత షేప్ అవుట్ కావడం తో, ఆ చిత్రం తరువాత ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో నటించిందిలేదు .
నితిన్ హీరోగా ఛలో సినిమా దర్శకుడు వెంకీ కుడుముల రూపొందిస్తోన్న భీష్మ చిత్రం లో హెబ్బా పటేల్ కీలక పాత్ర లో నటిస్తోంది . ఈ చిత్రం లేడి విలన్ గా కనిపించనుంది హెబ్బా పటేల్ . భీష్మ చిత్రం ద్వారా హెబ్బా పటేల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుంది . నితిన్ సరసన రష్మిక జోడిగా నటిస్తుండగా , హెబ్బా విలన్ గా కన్పించనుండడం తో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది . ఇప్పటి వరకు అల్లరి అమ్మాయి , ప్రేయసి పాత్రల్లో నటించిన హెబ్బా పటేల్ , లేడీ విలన్ గా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి .
గతం లో ఎంతో మంది కథానాయికలు విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు . మరి హెబ్బా పటేల్ వారి సరసన నిలుస్తుందా? లేదా?? అన్నది చూడాలి . ఇక హీరో నితిన్ కు ఈ సినిమా ఫలితం ఎంతో కీలకం కానుంది . ఇక ఇప్పటికే వరుస పరాజయాలతో కెరీర్ లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నితిన్ , భీష్మ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఛలో సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల, ఈ చిత్రం ద్వారా మరొక హిట్ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు .