ఎప్పటికప్పుడు పండగ సీజన్స్ లో ఒకేసారు 3-4 సినిమాలు రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా థియోటర్స్ విషయంలో నానా రచ్చ కావాల్సిందే. అంతేకాదు పెద్ద పండగైన సంక్రాంతి సీజన్ కూడా ఒకేసారి ఇద్దరు ముగ్గురు స్టార్లు తలపడాల్సి వచ్చినప్పుడు థియేటర్ల సమస్య రాదనుకున్నా వస్తూనే ఉంటుంది. ఇది గత కొన్నేళ్ళుగా గమనిస్తూనే ఉన్నాం. అందులోనూ థియేటర్ల వ్యవహారాల్లో కీలకంగా ఉండే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకునే నిర్ణయం మార్కెట్ ని బాగా ప్రభావితం చేస్తుంది. ఇక రాబోయే 2020 సంక్రాంతికి పెద్ద సమస్య వచ్చేలా కనిపిస్తుంది. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' తో పాటు అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' ఇప్పటికే పండక్కు కర్చీఫ్ వేసేశాయి.

డేట్స్ మాత్రం ఇంకా ప్రకటించలేదు కాని వాటికి సంబంధించిన చర్చల్లోనే మధ్యలో దిల్ రాజు అటు ఇటు సతమతవుతున్నట్టు తాజా సమాచారం. మహేష్ సినిమా సరిలేరు నీకెవ్వరు.. నిర్మాతల్లో దిల్ రాజు ఒకరన్న సంగతి తెలిసింది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ముందు సరిలేరు నీకెవ్వరు రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట. తర్వాత రెండు మూడు రోజులు గ్యాప్ లో అల వైకుంఠపురములో విడుదల చేస్తే ఇద్దరికీ ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి సమస్య ఉండదని మాట్లాడుకుంటున్నారట.

అయితే అల్లు కాంపౌండ్ మాత్రం ఒక్క రోజు అయితే వెయిట్ చేయగలమని పండగ రోజు నాడే రిలీజ్ చేస్తే ముందు సెలవు రోజులు మిస్ అవుతాయని.. దాని వల్ల ఓవరాల్ ఫిగర్స్ లో తేడా వస్తుంది కాబట్టి అలా కుదరనిని చెబుతున్నారట. అయితే ఈ వ్యవహారం అంత సులభంగా తేలేలా కనిపించడం లేదని లేటెస్ట్ అప్‌డేట్. ప్రిన్స్ సినిమాకు మొదటి మూడు రోజులు చాలా కీలకం కాబట్టి ఆ స్పాన్ వదిలేద్దామని దిల్ రాజు చెబుతున్నా అదే అడ్వాంటేజ్ తాము మాత్రం ఎందుకు ఒదులుకోవాలని గీత ఆర్ట్స్ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి బయటికి కనిపించని ఈ గొడవ తెగడానికి కొంత టైం పట్టేలా ఉందని ఇరు వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం. ఇంకా నాలుగు నెలలున్నాగాని థియోటర్స్ గొడవ టాలీవుడ్ లో అప్పుడే మొదలైందనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: