ఇటీవల ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఆలీ ఎలిమినేషన్ కావడంతో ఇంటిలో ఉన్న సభ్యులంతా తీవ్ర భావోద్వేగానికి గురైన సంగతి అందరికీ తెలిసినదే. ముఖ్యంగా శివ జ్యోతి చాలా కన్నీటి పర్యంతం అయ్యింది. దీంతో సోమవారం జరిగిన ఎపిసోడ్ లో కూడా శివ జ్యోతి ఏడుపు మొహం పెట్టుకొని రవితో కూర్చుని బాధ పడింది. ఇంతలో వారిద్దరి మధ్య శ్రీముఖి వచ్చి సీరియస్ అయింది. శ్రీముఖి మాట్లాడుతూ.. ''ఆపండెహే ఇది సంతాప సభ కాదు.. ఆడు చచ్చిపోలేదు. ఏడుస్తూ కూర్చోడానికి రెండు పీకుతా మిమ్మల్ని ఇద్దర్నీ.. మామూలుగా కొట్టను'' అని అరవడంతో ఇద్దరూ కంట్రోల్ అయ్యారు.


అలీ రజా ఎలిమినేట్ కావడానికి కారణమైన బాబా భాస్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో రెండో వారంలో కి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రాసెస్ ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఎలిమినేషన్ కార్యక్రమాన్ని రెండు గ్రూపులుగా ఇంట్లో ఉన్న 11 మంది సభ్యులను విడగొట్టారు. ఈ క్రమంలో ఇంటి సభ్యుడిగా ఎన్నికైన కెప్టెన్ బాబా భాస్కర్ కి ఎలిమినేషన్ నుండి మినహాయింపు దక్కింది.


అయితే గ్రూప్ 1లో రాహుల్, వరుణ్, వితికా, శిల్ప, పునర్నవిలు ఉండగా.. గ్రూప్‌ 2లో రవి, శివజ్యోతి, శ్రీముఖి, మహేష్, హిమజలు ఉన్నారు. ఒక్కో గ్రూప్‌ వాళ్లు.. తమ ఆపోజిట్ గ్రూప్‌లో ఉన్న ఇద్దరి ఫొటోలను తీసుకుని మంటల్లో కాల్చి నామినేట్ చేయడానికి సరైన కారణం చెప్పాలని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ప్రాసెస్ లో భాగంగా ఎలిమినేషన్ కి ఎన్నికైన వారు  శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖి. మొత్తం ఆరుగురు సభ్యులు ఈవారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇటువంటి నేపథ్యంలో వీరిలో ఒకరిని సేవ్ చేసే అవకాశాన్ని కెప్టెన్ బాబా భాస్కర్ కి బిగ్ బాస్ ఇవ్వగా బాబా భాస్కర్ మాస్టర్ రవి ని సేవ్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: