కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మన్మధుడు 2. కొన్నేళ్ల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించి, హీరోగా నటించిన మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడడం జరిగింది. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ, రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి మన్మధుడు 2 నెగటివ్ టాక్ మూటగట్టుకోవడం ఆ సినిమా యూనిట్ కి పెద్ద షాకే ఇచ్చింది. నిజానికి కథ పరంగా మంచి పాయింట్ ని ఎంచుకున్న దర్శకుడు రాహుల్, 

దానిని తెరపై ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా మలచడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడనే టాక్ విపిరీతంగా స్ప్రెడ్ అయింది. ఇకపోతే నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చిన ఆ సినిమా ప్రభావం వలన, ఇటీవల ప్రారంభం కావలసిన ఒక  స్టార్ హీరో సినిమా, అర్ధాంతరంగా ఆగిపోయి అటకెక్కినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి వెంకీమామ సినిమాలో నటిస్తున్న విక్టరీ వెంకటేష్, నిజానికి కొద్దిరోజుల క్రితం హిందీలో రిలీజ్ అయి, మంచి సక్సెస్ సాధించిన దే దే ప్యార్ దే అనే సినిమాలో నటించాలని భావించారు. లక్ష్యం, సాక్ష్యం, రామ రామ కృష్ణ కృష్ణ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో ఆ సినిమా ప్రారంభం కావలసి ఉంది. 

అయితే ఆ సినిమా కథ కూడా చాలావరకు మన్మధుడు 2 మాదిరి, ఒక మధ్యవయస్కుడైన వ్యక్తితో మంచి వయసులో అమ్మాయి ప్రేమలో పడి సంబంధం కొనసాగించే కాన్సెప్ట్ తో సాగనుండడంతో, ఇంచుమించు అదే సబ్జెక్టుతో నాగార్జున మన్మధుడు 2 రిలీజ్ అయి, బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో, దే దే ప్యార్ దే సినిమా రీమేక్ చేయకూడదని నిర్ణయించారట వెంకీ. అందుకే ఇటీవల ప్రారంభం కావలసిన ఆ సినిమా, అర్ధంతరంగా ఆగిపోయి అటకెక్కిందని అంటున్నారు. అయితే ఆ సినిమా స్థానములో వెంకటేష్, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు టాక్.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: