దివంగత దిగ్గజ నటి మరియు అతిలోకసుందరిగా పేరుగాంచిన శ్రీదేవి మరణించి దాదాపుగా ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ, ఆమె జ్ఞాపకాలను అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. ఇక తన కూతరు జాన్విని స్క్రీన్ మీద చూడాలి అని భావించిన కోరిక తీరకుండానే ఆమె మరణించారు. జాన్వీ తొలి చిత్రం ధఢక్, షూటింగ్ దశలో ఉండగానే శ్రీదేవి అర్ధాంతరంగా అనంతలోకాలకేగారు.తల్లి శ్రీదేవి తనను హీరోయిన్ గా చూడాలని ఎంతో ఆశపడేవారని, అయితే ఆ ఆశతీరకుండా ఆమె వెళ్లిపోవడం నిజంగా ఎప్పటికీ నన్ను బాధించే విషయం అని ఇప్పటికే పలు మార్లు ఇంటర్వూస్ లో చెప్పారు జాన్వీ. అయితే అమ్మ ఎక్కడ ఉన్నప్పటికీ తప్పకుండా ఆమె ఆశీస్సులు తనకు ఉంటాయని ఆమె చెప్తుంటారు. 

ఇకపోతే జాన్వీ నటించిన తొలిచిత్రం ధఢక్, ప్రేక్షకుల అంచనాలు అందుకుని మంచి సక్సెస్ సాధించడంతో పాటుగా తొలి చిత్రంతోనే తన ఆకట్టుకునే నటనతో తల్లికి తగ్గ తనయగా మంచి పేరు సంపాదించింది జాన్వీ. ఇక ప్రస్తుతం కార్గిల్ వీరనారి గుంజన్ సక్సేనా బయోపిక్ తో మరొక రెండు సినిమాల్లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలతో పాటు ఎప్పటికపుడు పలు పత్రికలకు ఫోటోలకు ఫోజులిచ్చే జాన్వీ, నేడు బ్రైడ్ టుడే మ్యాగజైన్ సెప్టెంబర్ సంచిక కవర్ పేజిపై మెరిసింది. ఇక ఆ ఫోటోలో జాన్వి పింక్ కలర్ టాప్, మరియు స్కర్ట్ ధరించి, తన అందాలను ఒలికిస్తూ ఫోజిచ్చింది. సహజంగా అనిపించే మేకప్ తో పాటుగా ఆ డ్రెస్ కు సరిగ్గా సరిపోయే యాక్సెసరీస్ ధరించింది జాన్వీ. అలానే వాటితోపాటు చేతులకు బ్యాంగిల్స్, వయొలెట్ మరియు పింక్ కలర్ ఫెదర్స్ ఉండే వెరైటీ రిస్ట్ బ్యాండ్స్ లాంటివి ధరించి అందరినీ అబ్బురపరిచింది. 

ఇక ఈ లుక్ లో ఆమెను చూసిన అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఆమెను ఈ ఫొటోలో చూస్తుంటే, అచ్చం అతిలోక సుందరి శ్రీదేవిని చూసినట్లుందని, తప్పకుండా రాబోయే మరికొద్దిరోజుల్లో జాన్వీ, బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి పేరు సంపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా జాన్వీ ఫోజిచ్చిన ఆ మ్యాగజైన్ ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: