బిగ్ బాస్ సీజన్ 3‌లో అసలు మజా మొదలైంది. ఎలిమినేషన్ ప్రక్రియ షురూ కాగా.. తొలివారంలోనే హేమ ఇంటి ముఖం పట్టగా.. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసారు. అలాగే, మూడో వారం తమన్నా సింహాద్రి, నాలుగో వారం రోహిణి, ఐదోవారం అషు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ఇక ఆరోవారం నామినేషన్‌లో హిమజ, పునర్నవి, మహేష్‌లు నామినేట్ కాగా.. ఈ ముగ్గుర్నీ సేవ్ చేస్తూ ఎలిమినేషన్ తీసేశారు. గత వారం హౌస్లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న అలీ ఎలిమినేట్ అయ్యాడు.

ఇక ఎనిమిదో వారం ఎలిమినేషన్ కోసం హౌస్‌లో ఉన్న 11 మంది కంటెస్టెంట్స్‌లో నుండి ఒకరిని  బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకి  పంపేందుకు బిగ్ బాస్ నామినేషన్స్ స్టార్ట్ చేసాడు.  ఈవారం నామినేషన్స్ లో  భాగంగా హౌస్‌లో ఉన్న 11 మందిని రెండు గ్రూపులుగా విడగొట్టారు. అయితే హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న బాబా భాస్కర్‌కి మినహాయింపు ఇచ్చారు. ఒక గ్రూప్ లో  రాహుల్, వరుణ్, వితికా, శిల్ప, పునర్నవిలు ఉండగా.. మరో గ్రూప్‌ లో రవి, శివజ్యోతి, శ్రీముఖి, మహేష్, హిమజలు ఉన్నారు. తమ ఆపోజిట్ గ్రూప్‌లో ఉన్న ఇద్దరి ఫొటోలను తీసుకుని మంటల్లో కాల్చి నామినేట్ చేయడానికి సరైన రీజన్ చెప్పాలని  బిగ్ బాస్ తెలిపాడు. 

ఇక ఈ నామినేషన్స్ ప్రాసెస్‌లో ఎక్కువ మంది  హౌస్ మేట్స్  శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖిలను నామినేట్ చేయడంతో ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు. ఆ తరువాత ప్రస్తుత బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయిన బాబా భాస్కర్ కి ప్రత్యేక అధికారం ఇచ్చాడు. ఆ అధికారంలో నామినేట్ అయినవారిలో నుండి ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇవ్వగా , బాబా రవి ని సేవ్ చేసాడు. గత వారం ఇచ్చిన టాస్క్‌లో రవి చాలా బాగా ఆడాడని అందుకే అతన్ని సేవ్ చేస్తున్నట్టు తెలిపాడు. దీనితో మొత్తంగా ఈ వారం నామినేషన్‌లో శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, శ్రీముఖి ఐదుగురు ఉన్నారు. వీరిలో ఈ  వీకెండ్  హౌస్ నుండి బయటకి వెళ్లేది ఎవరో  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: