అందాల నటి అతిలోకసుందరి దివంగత నటి శ్రీదేవి పెద్దకూతురు వెండితెర వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన తల్లి పేరు నిలబెట్టాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్. 'ధడక్'  అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. సినిమాతో పరవాలేదు అనిపించుకోవడం తో జాన్వి కపూర్ కి ప్రస్తుతం మెల్లమెల్లగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. దీంతో సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటూ ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ వైరల్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పుకొచ్చింది.


'శ్రీదేవితో ఎప్పుడైనా.. మీ పెళ్లి గురించి చర్చించారా..?' అని ప్రశ్నించగా.. మాట్లాడానని చెప్పుకొచ్చింది జాన్వీ. మగవారి విషయంలో తన తీర్పుపై అమ్మకి నమ్మకం లేదని.. ఈ విషయంలో తన అభిప్రాయాలను నమ్మేది కాదని చెప్పింది. అంతేకాకుండా తన కోసం తన తల్లి శ్రీదేవి స్వయంగా ఒకరిని సెలెక్ట్ చేయాలని అనుకుందట.. దానికి కారణం జాన్వీ ఇతరులను చాలా తేలిగ్గా ప్రేమించేస్తుందట. ఈ విషయాలను ఆమె స్వయంగా వెల్లడించింది. ఇక కాబోయే వాడు  ఎలా ఉండాలనే అడిగితే.. వృత్తి పట్ల అంకితభావం ఉండాలని, చాలా నైపుణ్యం ఉండాలని.. హాస్యచతురత చాలా ముఖ్యమని.. తనను బాగా ప్రేమించేలా ఉండాలని చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా తన పెళ్లి తిరుపతిలో జరుగుతుందని సాంప్రదాయబద్దంగా చేసుకుంటానని పెళ్లికి కంచి జరీ చీర కట్టుకొని పెళ్లి పీటలు ఎక్కుతా అని అంతేకాకుండా తనకు ఇష్టమైన దక్షిణాది వంటకాలు ఇడ్లీ సాంబార్ పెరుగు అన్నం వంటకాలతో భోజనం చేస్తా అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అంతా సోషల్ మీడియాలో జాన్వికపూర్ అభిమానులు మొత్తానికి జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి యాజ్ టీజ్ గా ఫాలో అయిపోతుందని కామెంట్ చేస్తున్నారు. 

  



మరింత సమాచారం తెలుసుకోండి: