బాబా సంగతేంటో చూపిస్తానంటున్న శిల్ప అయ్యో ఏందీ ఈ నామినేషన్ అంటూ తలపట్టుకున్న శిల్పా అంటూ చూపించింది. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంటున్న మహేష్ ని లవ్ షేప్ లో ఆమ్లేట్ వేసిన వితికా కాకపోతే వికటించిందని జ్యోతి అంది. ఎప్పటికీ నేనే కెప్టెన్ అంటున్న బాబా మాస్టర్, కిచెన్ టీంలో మేమిద్దరమే ఉండాలంటున్న శ్రీముఖి, బాబా అని జ్యోతి చెప్పింది. వరుణ్ వితికకు ముద్దుపెట్టే పోటో, ఫ్రెండ్ ని బాగా మిస్సైపోతున్న రవి, సంత్రా పండును తింటున్న రాహుల్, చివరిగా లేడీస్ గ్యాంగ్ ఫోటోని చూపించింది. ఆ తర్వాత పునర్నవి ఇంటర్వ్యూని ప్లే చేశారు. నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని బిగ్ బాస్ అన్నాడు. ఇప్పటి నుంచి ఫినాలి కోసం మీ రేస్ మొదలుపెట్టాలనీ చెప్పాడు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఇంట్లో మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తోందని స్నేహాలు,బంధాలు ఫినాలీలో పక్కనపెట్టాలని అన్నాడు.
నామినేషన్ ప్రక్రియలో రెండు గ్రూప్స్ లుంటాయని మొదటి గ్రూప్ లో శ్రీముఖి, హిమజ, మహేష్, రవి, శివజ్యోతి ఉంటారనీ రెండో గ్రూప్ లో వరుణ్, వితిక, రాహుల్, పునర్నవి, శిల్ప ఉంటారని బాబా ఇంటి కెప్టెన్ అయినందు వల్ల ఏ గ్రూప్ లో ఉండడని బిగ్ బాస్ చెప్పాడు. ఒక గ్రూప్ సభ్యులు ఇంకో గ్రూప్ సభ్యులను నామినేట్ చేయాలని సూచించాడు. ఒక్కొక్కరూ ఇతర గ్రూప్ లోని ఇతర సభ్యుల పేర్లు చెప్పి వాళ్ళ ఫోటోలను మంటల్లో కాల్చి అక్కడ ఉన్న బూడిదతో తిలకం పెట్టి కారణాలు వివరించాలని అన్నాడు. వచ్చి శిల్ప, రాహుల్ ఫొటోలు కాల్చి వాళ్ళకు బొట్టు పెట్టాడు. పునర్నవి, శ్రీముఖి, మహేష్ ని నామినేట్ చేసింది. శివజ్యోతి, పునర్నవి,శిల్పని నామినేట్ చేసింది. శిల్ప, జ్యోతి, హిమజలను నామినేట్ చేసింది. శ్రీముఖి, పునర్నవి,శిల్పని నామినేట్ చేసింది. వితిక, మహేష్, రవిని నామినేట్ చేసింది. హిమజ, శిల్ప,వితికను నామినేట్ చేసింది. వరుణ్, మహేష్,హిమజను నామినేట్ చేశాడు.
మహేష్, వరుణ్, పునర్నవిని నామినేట్ చేశాడు. రాహుల్, రవి, శ్రీముఖిని నామినేట్ చేశాడు. శిల్ప, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖి ఎక్కువ ఓట్లతో నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. ప్రత్యేక అధికారాలను ఉపయోగించి నామినేటైన సభ్యుల్లోంచి ఒకరిని సేవ్ చేయాలని కెప్టెన్ బాబా మాస్టర్ కి చెప్పాడు. నామినేట్ అయిన వాళ్ళు చేయెత్తాలని బాబా అడిగాడు. రవిని సేవ చేస్తున్నానని బాబా మాస్టర్ బిగ్ బాస్ కు చెప్పాడు. టాస్క్ ఆడేటప్పుడు రవి జెన్యూన్ గా ఉన్నాడని అన్నాడు, అంతా రవికి కంగ్రాట్స్ చెప్పారు. శ్రీముఖి వెళ్లి దిగాలుగా కూర్చుంది.బాబా మాస్టర్ ఫీలయ్యావా అని అడిగినందుకే బాధపడ్డానని శ్రీముఖి హిమజతో చెప్పింది. ఏది ఏమైన బాబా మాస్టర్ ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని అంది. పుట్టినందుకు నలుగురికి మంచి చేసి పోవాలని పునర్నవితో బాబా మాస్టర్ అన్నాడు. మా అమ్మ గుర్తొచ్చిందని పునర్నవి ఏడ్చింది. వరున్, వితికకు శ్రీముఖి అంటే పడదు, ఆమెను వదిలేసి నా దగ్గరికి రావడం ఆశ్చర్యంగా ఉందని మహేష్ అన్నాడు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో యాభై వ రోజు ముగిసింది.