వరుస పరాజయాలతో సతమతమైన యువసామ్రాట్ నాగ చైతన్య  ఇటీవల మజిలీ తో సూపర్ హిట్ అందుకున్నాడు. సమ్మర్ లో విడుదలైన ఈ చిత్రం  చైతూ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టి  రికార్డు సృష్టించింది.  ఇక  ఈ చిత్రం ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ అవుతున్నాడు  చైతన్య.  అందులోభాగంగా చైతూ  ఇటీవల  విక్టరీ వెంకటేష్ తో  కలిసి వెంకీ మామ చిత్రాన్ని పూర్తి చేశాడు.  అలా ఆ సినిమా షూటింగ్ పూర్తయిందో లేదో  వెంటనే  చైతన్య మరో చిత్రాన్ని  మొదలుపెట్టాడు.  ప్రస్తుతం ఆయన , శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటిస్తున్నాడు.  సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. 



ఇక ఇప్పుడు చైతూ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బడాయి హో రీమేక్ లో  నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం.  ఈరీమేక్ హక్కులను  ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నాడు.   కాగా దిల్ రాజు కు ఇంతకుముందే నాగ చైతన్య సినిమా చేస్తానని కమిట్మెంట్ ఇచ్చాడు దాంతో ఇప్పుడు ఆయన  నిర్మాణంలో  ఈరీమేక్ ను చేయాలని భావిస్తున్నాడట నాగచైతన్య.  మరి ఈ చిత్రానికి  ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి. 


కాగా ఈ సినిమా తో పాటు చైతన్య  ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తో మహా సముద్రం అనే చిత్రాన్ని చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.  నిజానికి ఈచిత్రాన్ని అజయ్ భూపతి , రవితేజ తో చేయాలనుకున్నాడు అందుకు రవితేజ కూడా ఓకే చెప్పాడు.  అయితే  ఏమైందో ఏమో సడెన్ గా  రవితేజ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.  దాంతో  చైతన్య కు స్టోరీ వినిపించాడట  అజయ్  భూపతి.  త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వెలుబడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: