శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ నటించిన సినిమా కేవలం ఇప్పటి వరకు ఒక్కటి మాత్రమే విడుదల అయినా ఆమెకు వచ్చిన ఇమేజ్ టాప్ హీరోయిన్ కు కూడ లేదు. దీనికితోడు ఆమె తరుచు హాట్ ఫోటో షూట్స్ ఇస్తూ ఉండటంతో పాటు తరుచు బాలీవుడ్ మీడియా గాసిప్పులలో ఆమె పేరు చాల ప్రముఖంగా వినిపిస్తుంది.

ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య ఒక ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ తన పెళ్లి విషయమై తన ఆలోచనలను బయట పెట్టింది. తన తల్లి శ్రీదేవికి ఆమె జీవించి ఉన్న రోజులలో తనపై నమ్మకం తక్కువని అందువల్లనే తాను ఎక్కడ ఎవరి ప్రేమలో పదిపోతానో అన్న భయంతో తాను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఆమె అప్పట్లో పెట్టిన కండిషన్స్ ను గుర్తుకు చేసుకుంది. 
 
తాను పెళ్లి చేసుకోపోయే అబ్బాయి పై తన అభిప్రాయం వెల్లడిస్తూ అతడిలో మంచి టాలెంట్ ఉండాలని అదేవిధంగా అతని దగ్గర నుంచి కొత్త విషయాలు తాను నేర్చుకునేలా ఉండాలని జాహ్నవీ తన మనసులో మాట బయట పెట్టింది. అయితే తన పెళ్ళి మాత్రం సాంప్రదాయ పద్ధతిలో జరగాలని కోరుకుంటున్న విషయాన్ని వివరిస్తూ తిరుపతిలో మాత్రమే చేసుకుంటాను అని అంటోంది.

అంతేకాదు తన పెళ్ళికి వచ్చిన వారందరికీ దక్షిణాది సంప్రదాయంతో దక్షిణాది వంటకాలను రుచి చూపిస్తాను అని అంటోంది. అయితే ఇన్ని చెప్పిన జాన్వీ తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో ఎవర్ని పెళ్ళి చేసుకుంటానో తనకు తెలియదు అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ కరణ్ జోహార్ నిర్మాణంలో రెండు సినిమాలలో నటిస్తోంది. ఆమె నటిస్తున్న ‘గుంజన్ సక్సేనా’ 2020 మార్చిలో విడుదల కాబోతోంది. అయితే ఆమెను తెలుగు సినిమాలలోకి తీసుకు రావాలని ఎందరో బడా నిర్మాతలు ప్రయత్నిస్తున్నా ప్రస్తుతం ఆమె మాత్రం స్పందించడం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: