కొద్దిరోజుల ముందు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నాడు అని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి జనసేన పార్టీ ఒక అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం జనసేనానికి సినిమాల గురించి ఎలాంటి ఆలోచనలు లేవని వారు తేల్చి చెప్పేశారు. పవన్ కళ్యాణ్ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా తనకు మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్తూనే ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న మంచి లక్షణం అవతల వాళ్ళ కష్టాన్ని చూసి ఓర్వలేకపోవడం. ఇప్పుడు దాని వల్లనే ఆయన మళ్ళీ సినీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడట.

సీనియర్ ప్రొడ్యూసర్ ఏ.ఎమ్ రత్నం కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ని తన కోసం ఒక మూవీ చేయమని అడుగుతూ ఉన్నాడట. ఈ మధ్యకాలంలో విపరీతమైన ఫ్లాపులు వల్ల రత్నం గారి సూర్య మూవీస్ అప్పుల్లో కూరుకుపోయింది. ఆయనకు ఈ పరిస్థితి నుండి బయట పడేందుకు పవన్ కళ్యాణ్ తప్ప ఇంకొకరు కనిపించలేదు. దీంతో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ను వాడుకొని అతను భారీ వసూళ్లు మరియు లాభాలు సాధించాలని చూస్తున్నాడు.

అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు క్రిష్ జాగర్లమూడి చాలా ఆతృతగా ఉన్నాడట. ఇదివరకే... బాగా అభ్యుదయ భావాలున్న పవర్ ఫుల్ లీడర్ కథ, 'సత్యాగ్రహి' పవన్ కళ్యాణ్ కు వినిపించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే కథని మళ్ళీ ఏ ఎం. రత్నంతో కలిసి పవన్ కళ్యాణ్ ముందుకి తీసుకుపోనున్నాడట. వీరిద్దరు కలిసి ఏ క్షణంలో అయినా పవన్ కళ్యాణ్ ను అతని ఆఫీసులో కలవచ్చు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఒకవేళ ఈ ప్రాజెక్టు కనుక పట్టాలెక్కితే పవన్ కళ్యాణ్ కే చాలా లాభం ఉంది. కష్టాల్లో ఉన్న ప్రొడ్యూసర్ ని ఆదుకున్న మంచిపేరు ఒకవైపు లభిస్తే మరోవైపు తిరుగుబాటు లక్షణాలున్న సత్యాగ్రహి చేయడం వల్ల అతనికి పొలిటికల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది. అయితే నిర్ణయం మాత్రం పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: