కేజీఎఫ్ మూవీ ఓ సంచలనం. ఆ మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. మల్టీ  టాలెంట్ ఉన్న ఈ యూత్ ఫుల్ డైరెక్టర్ ఎనర్జీని వాడుకోవడానికి అగ్ర హీరోలు క్యూ కడుతున్నారు. అయితే కేజీఎఫ్ 2 ని కూడా రిలీజ్ చేసిన తరువాతనే కొత్త కమిట్మెంట్స్ ఉంటాయని ప్రశాంత్ క్లారిటీగా చెప్పుకొచ్చాడు. దాంతో అప్పట్లో కేజీఎఫ్ కి వచ్చిన గ్రాండ్ రెస్పాన్స్ ని  ప్రశాంత్ స‌రిగా ఉపయోగించుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.


ఇదిలా ఉండగా కేజీఎఫ్ 2 పూర్తి కావచ్చింది. దాంతో ఇపుడు ప్రశాంత్ నీల్ కొత్త మూవీ ఏంటి అన్న చర్చ మొదలైంది. ఆయన ఎవరితో సినిమా చేస్తాడన్నది కూడా ఇంటెరెస్టింగ్ పాయింట్ గా ఉంది. టాప్ స్టార్స్ ఇద్దరితో కధ చెప్పి ప్రశాంత్ ఒప్పించాడని అంటున్నారు. జూనియర్ ఎన్టీయార్ తో మైత్రి మూవీస్ నిర్మించే  సినిమాకు ప్రశాంత్ డైరెక్టర్ గా ఉంటాడని టాక్ వచ్చింది.


అయితే ఇపుడు ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీయార్ లాక్ అయిపోయాడు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అంటున్నారు. షూటింగ్ కంప్లీట్ కావడానికి ఇంకా ఆరు నెలల టైం అయినా పడుతుందని చెబుతున్నారు. ఈ టైంలో మహేష్ ని కూడా ప్రశాంత్ కలవడం పెద్ద చర్చగా అయింది. మహేష్ సరిలేరు నీకెవ్వరూ మూవీతో ఇపుడు బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. 


దాంతో డిసెంబర్ నాటికి మహేష్ ఖాళీ అయిపోతాడు. అంటే మహేష్ తోనే కేజీఎఫ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు కధ చెప్పిన ప్రశాంత్ కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.  మహేష్ తో యూత్ ఫుల్ రఫ్ మూవీని చేసేందుకు ప్రశాంత్ కధ రెడీ చేశాడని అంటున్నారు. అదే కనుక జరిగితే సూపర్ స్టార్ పెద్ద హిట్ కొట్టినట్లేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: