మాహర్షి తరువాత  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'.  ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి   పెద్దగా బ్రేక్ లేకుండా శరవేగంగా షూటింగ్  జరుపుకుంటుంది. అందులో భాగంగా  ఇటీవలే  ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకోగా   ప్రస్తుతం మూడవ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో  జరుగుతుంది .  ఈ షెడ్యూల్ కోసం అక్కడ 4కోట్లా ఖర్చు తో .కర్నూల్ లోని  ఫేమస్  ఫోర్ట్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ ను నిర్మించారు.



ఈ  షెడ్యూల్ లో  యాక్షన్ సన్నివేశాలను  చిత్రీకరిస్తున్నారు. ఈనెల13తో ఈషెడ్యూలఈషెడ్యూల్ పూర్తి కానుంది. ఆతరువాత  నెక్స్ట్ షెడ్యూల్  ఈనెల చివర్లో స్టార్ట్ కానుంది.  ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్  రెండో వారంకల్లా  మొత్తం పూర్తి కానుంది. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని  వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేయనున్నారు.  కాగా   ఇప్పటికే ఈ చిత్రం ప్రీ రిలీజ్  బిజినెస్ ను కూడా పూర్తి చేసుకుంటుంది. 




సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అని రావిపూడి  డైరెక్షన్ లో  కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది.  వీరితో పాటు సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తుండగా  మిల్కీ బ్యూటీ తమన్నా  స్పెషల్ సాంగ్ లో  మెరవనుంది.  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: