అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. కానీ ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఇప్పటికే ఈ సినిమాలో చాలమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించి చివరికీ పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫైనల్ చేసింది చిత్రబృందం. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పూజా డేట్లు ప్రస్తుతం ఖాళీ లేకపోవడంతో అఖిల్ సరసన నటించడం లేదట. మొత్తానికి ఇప్పటికి కూడా ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఆ మధ్య కియరా అద్వానీ లేదా రష్మికా మండన్నలో ఎవరో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ వాటిల్లో నిజం లేదని తేలిపోయింది. మొదట కొంతమంది స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినా చివరికీ కొత్త అమ్మాయి వైపే మొగ్గు చూపారట దర్శక నిర్మాతలు. కాకపోతే ఆ కొత్త హీరోయిన్ అఖిల్ బాబుకు నచ్చట్లేదట. దాంతో నిర్మాతలు మరో హీరోయిన్ను తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. యంగ్ హీరోయిన్ కేతికా శర్మను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి అఖిల్ సరసన కేతికా శర్మను ను తీసుకుంటారా లేక కొత్త హీరోయిన్ ను తీసుకుంటారా అనేది చూడాలి.
కాగా ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం పరుశురామ్ - అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. పరుశురామ్ అఖిల్ కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారట.. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరి 'గీత గోవిందం'తో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న పరుశురామ్ అఖిల్ తో చేయబోయే తన తరువాత సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి.