ప్రభాస్ సాహో తరువాత జాన్ సినిమాపై దృష్టి పెట్టారు. సాహో సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్నీ యూనిట్ అఫీషియల్ గా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సినిమా బయటపడింది. కానీ, తెలుగుతో పాటు ఇతరభాషల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. తెలుగులో దాదాపు రూ. 30 నుంచి రూ. 40 కోట్ల రూపాయల మేర నష్టాలు వచ్చే వచ్చే అవకాశం ఉన్నది.
ఈ సినిమా ఫెయిల్ తరువాత ప్రభాస్.. దిల్ రాజును కలిసి మాట్లాడారు. గతంలో ప్రభాస్.. దిల్ రాజు కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి. ప్రభాస్ బాహుబలి తరువాత పాన్ ఇండియా హీరో కావడంతో.. అయన తో సినిమాలు చేయాలంటే భారీగా ఖర్చు అవుతుంది. అయితే, దిల్ రాజుకు సాహో ద్వారా నష్టాలు రావడంతో.. ఆ నష్టాలను పూడ్చేందుకు దిల్ రాజుతో ప్రభాస్ సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడని సమాచారం.
ఇక ఇండ్ల ఉంటె పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి లైన్లోకి వచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్టైంది. ఇష్మార్ట్ విజయం తరువాత పూరి అర్జున్ రెడ్డి దర్శకుడు విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఫైటర్ పేరుతో సినిమా తెరకెక్కబోతున్నది. అటు బాలయ్యతోను సినిమా చేసేందుకు పూరి రెడీ అవుతున్నాడు. మహేష్ బాబుతో సినిమా చేయాలని అనుకున్నా వర్కౌట్ కావడం లేదు. గతంలో ఒకే చెప్పిన మహేష్ బాబు ఆ తరువాత పూరి స్క్రిప్ట్ ను పక్కన పెట్టాడు.
సాహో పరాజయం తరువాత ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా జాన్ పై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. సిటీలోనే ఉన్న ప్రభాస్ ను పూరి ఇటీవలే కలిశారట. ఈ సందర్భంగా పూరి ప్రభాస్ కు ఓ లైన్ చెప్పారని, లైన్ నచ్చిందని ప్రభాస్ చెప్పడంతో కథను సిద్ధం చేసుకోవడానికి పూరి సిద్ధం అవుతున్నాడు. ఒకవేళ పూరి రెడీ చేసిన కథకు ప్రభాస్ ఒకే చెప్తే.. అసలు మాస్ అంటే ఏంటి ఎలా ఉంటుంది.. మాసిజం ఏ రేంజ్ లో ఉంటుందనే విషయాలను పూరి ఇండియన్ ప్రేక్షకులకు చూపిస్తాడు. దానికంటే ముందు డార్లింగ్ ప్రభాస్ ను మెప్పించే కథను పూరి రెడీ చేయాలి కదా.