యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వచ్చిన సాహో సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన సాహో 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్ కొద్దిరోజుల్లో జాన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ తో ఆ సినిమా హీరోయిన్ పూజా హెగ్దె సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.


ప్రభాస్ 20వ సినిమాగా వస్తున్న జాన్ (వర్కింగ్ టైటిల్) జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ మూవీని కూడా యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. యూరప్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే పిరియాడికల్ డ్రాంగా ఈ సినిమా వస్తుంది. ఈ మూవీ కూడా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట నిర్మాతలు.


ఇక ఈ మూవీకి సంబందించిన అప్డేట్స్ రివీల్ చేస్తూ షాక్ ఇస్తుంది పూజా హెగ్దె. ఈ సినిమాలో ప్రభాస్ ను చాలా కొత్తగా చూస్తారని అంటున్న పూజా చాలా కాలం తర్వాత ఒక గొప్ప స్క్రిప్ట్ ఇదని. ఇందులో ట్విస్టులు అదిరిపోతాయని చెబుతుంది పూజా హెగ్దె. ఈ సినిమాను గోపికృష్ణ బ్యానర్ లో కృష్ణం రాజు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


సాహోతో మరోసారి తన మార్కెట్ ఏంటన్నది ప్రూవ్ చేసుకున్న ప్రభాస్ ఇక మీదట తన అన్ని సినిమాలకు ఈ రేంజ్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పూజా హెగ్దె కూడా బాలీవుడ్ లో సినిమాలు చేసింది కాబట్టి జాన్ కూడా కేవలం తెలుగులోనే కాదు తమిళ, హింది భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  2020 సమ్మర్ లో జాన్ రిలీజ్ ప్లా చేస్తున్నారు.           



మరింత సమాచారం తెలుసుకోండి: