సాయిపల్లవితో ఫిదా తీశాడు డైరెక్తర్ శేఖర్ కమ్ముల. ఆ మూవీ ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే. సాయిపల్లవి ఎన్ని సినిమాలు చేసినా కూడా ఫిదా వెంటాడుతూనే ఉంది. ఆడియన్స్ కి కూడా సాయిపల్లవి ఆ పాత్రలో జీవించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతోంది. ఇదిలా ఉండగా సాయిపల్లవి గ్లామర్ రోల్స్ కి పెద్దగా ప్రయారిటీ ఇవ్వడంలేదన్న సంగతి తెలిసిందే. ఆమె మూవీస్ అన్నీ కూడా తన పాత్రను కరెక్ట్ గా ఎంచుకుని నటిస్తుందని చెబుతారు.


అటువంటి సాయిపల్లవి మరోసారి ఫిదా డైరెక్టర్ శేఖర్ కమ్ములతో మూవీ చేస్తోంది. హీరో నాగచైతన్య. ఈ ఇద్దరి  కాంబో ఫ్రెష్ గా ఉంది. ఇక సినిమా కధ విషయానికి వస్తే పల్లెటూరి నుంచి వచ్చిన ఇద్దరు యువతీయువకులు జీవితంలో ఏదో సాధించలానుకుంటారు. అనుకోని సందర్భంలో ప్రేమలో పడతారు.


ఓ విధంగా ఇది సంగీత ప్రధాన చిత్రమని కూడా చెబుతున్నారు. ఇందులో నాగ చైతన్య తెలంగాణా స్లాంగ్ లో డైలాగులు చెబుతారట. ఇక సాయిపల్లవి యాజ్ యూజువల్ గా బలమైన పాత్రలో కనిపిస్తుంది. ఈ మూవీ ముహూర్తం షాట్ ఈ మధ్యనే తీశారు. వరస షెడ్యూల్స్ తో ఈ మూవీ శరవేంగా పూర్తి చేసుకుని సమ్మర్ డేస్ కి హాయ్  అంటూ ఆడియన్స్ ని పలకరించే అవకాశాలు ఉన్నాయి.


ఇదిలా ఉండగా దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాగార్జున రమ్యక్రిష్ణలతో  సంగీత ప్రధాన చిత్రంగా సంకీర్తన వచ్చింది. దాన్ని గీతాక్రిష్ణ డైరెక్షన్ చేశారు. ఇపుడు నాగ చైతన్య ఇలాంటి కధలోనే  నటించడం విశేషం. మరి నటనలో మంచి మార్కులు నాగ్ కొట్టేస్తాడేమో చూడాలి. ఇక సాయిపల్లవి కూడా కొత్త పాత్రలో ఎలా అదరగొడుతుందో కూడా చూడాలి.  శేఖర్ కమ్ముల ఫిదా  మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేస్తాడంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: