ఈ మాటలు అంటుంది ఎవరో కాదు..ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన అందాల భామ విజయశాంతి.  ఏఎన్ఆర్,కృష్ణ,బాలయ్య, చిరంజీవి ఇలా టాప్ హీరోల సరసన నటించి మెప్పించిన విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించించింది.  టాలీవుడ్ లో ఆమెను లేడీ అమితాబ్ గా పిలిచే వారు.  అప్పట్లో కొత్త హీరోయిన్ల జోరు పెరిగిపోవడంతో విజయశాంతి సినీ పరిశ్రమకు దూరం అయ్యింది. అదే సమయంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టింది.  బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల్లో ఉన్న ఆమె తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యింది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విజయశాంతి చాలా కాలం తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. దాదాపు 13 ఏళ్లు సినిమా ఇండస్ట్రీలో దూరంగా ఉన్న ఈమె 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతోరీఎంట్రీ ఇవ్వనుంది.  అయితే ఈ తరం హీరోయిన్లలో మీకు ఎవరంటే ఇష్టమని విజయశాంతిని ప్రశ్నించగా.. దానికి షాకింగ్ సమాధానం చెప్పింది. ప్రస్తుతం హీరోయిన్లు గ్లామర్ తరహా పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. 

నటనపై ఫోకస్ అస్సలు లేదు..హావభావాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో తనలాంటి హీరోయిన్లు 24 నాలుగు గంటలూ పని చేస్తుండేవారని.. ఏడాదిలో ఒకేసారి 18 సినిమాలు చేసేవారని.. కానీ ఇప్పుడున్న వారు అలసిపోతారని ఏడాదికి రెండు, మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నారని కామెంట్స్ చేసింది. ప్రేక్షకులను అలరించడానికే ఉన్నది..అలాంటిది ఈ మద్య హీరోయిన్స్ చాలా డిమాండ్ గా ఉంటున్నారు.  ఎన్టీఆర్, కృష్ణలాంటి స్టార్ హీరోలు ఇరవై రోజుల్లో సినిమా షూటింగ్‌లు పూర్తి చేసేసేవారని, ఇప్పుడు అలా సాగడం లేదని అన్నారు. 

ఇప్పటి హీరోయిన్లు చేస్తున్న సినిమాల్లో తనను ఏవీ ఇంప్రెస్ చేయలేదని చెప్పుకొచ్చింది. ఇక సినిమా టెక్నాలజీ గురించి మాట్లాడుతూ.. అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందని చెప్పింది.  ఫ్యూజువల్ వండర్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: