ఒకానొక సమయంలో తెలుగు సినిమా రంగంలో కమర్షియల్ సినిమాలు చేస్తూ మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి అప్పట్లో ఉన్న సీనియర్ స్టార్ హీరోలందరి పక్కన నటించి తర్వాత కొన్నాళ్లకు పాలిటిక్స్ లో అడుగుపెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో కీలకంగా ఉన్న విజయశాంతి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ నేతగా కొనసాగిస్తూ ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ మొహానికి మేకప్ వేసుకుని మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది.


ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్న విజయశాంతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ ఉన్న హీరోయిన్లలో ఎవరంటే మీరు లైక్ చేస్తారు అని యాంకర్ ప్రశ్నించగా విజయశాంతి ఇచ్చిన సమాధానం అందరికీ షాక్ ఇచ్చింది. ఇంటికి విజయశాంతి ఇచ్చిన సమాధానం ఏమిటంటే..ప్రజెంట్ జనరేషన్ హీరోయిన్ లలో ఎవరూ తనకి నచ్చలేదని తనని ఇంప్రెస్ చేసేవారు ఇండస్ట్రీలో లేరని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు ఉన్నా గానీ ఎవరి మీద తనకి ఫోకస్ లేదని ఇంప్రెస్ చేయలేకపోయారని విజయశాంతి పేర్కొంది.


మేము హీరోయిన్లుగా ఇండస్ట్రీలో ఉన్న సమయంలో 24 గంటలు అప్పట్లో ఉన్న హీరోయిన్లు పని చేస్తుండేవారని.. ఏడాదిలో ఒకేసారి 18 సినిమాలు చేసేవారని.. కానీ ఇప్పుడున్న వారు అలసిపోతారని ఏడాదికి రెండు, మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నారని కామెంట్స్ చేసింది. కష్టం అనే పదానికి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందని విజయశాంతి అన్నారు. ఇంకా సినిమా రంగం గురించి టెక్నాలజీ గురించి ప్రస్తుతం ఉన్న హీరోలు గురించి అప్పట్లో ఉన్న చీరాల గురించి వారి పనితనం గురించి అనేక విషయాల్లో ఈ ఇంటర్వ్యూలో విజయశాంతి తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: