సాధారణంగా ఈ మద్య సోషల్ మీడియాలో ఇంత చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ నానా యాగీ చేస్తున్నారు.  ఉన్న వాస్తవాలు పక్కన బెట్టి లేని పోని విషయాలు ఎక్స్ పోజ్ చేయడంతో సెలబ్రెటీలు నానా తంటాలు పడాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితి బాలీవుడ్ దర్శకుడు ఎదుర్కొన్నారు..దాంతో మీడియాపై చిందులు వేశారు. అసలు విషయానికి వస్తే.. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా  1980ల కాలం నేపథ్యంలో ‘ముంబయి సాగా ’ సినిమా తెరకెక్కిస్తున్నారు. 

ఈ మూవీలో హీరోయిన్ గా కలువుకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అర్జున్ రాంపాల్ హీరోగా నటిస్తున్నారు.  అయితే ఈ మూవీలో నుంచి కాజల్ తప్పుకుందని..ఆమె స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం తమన్నా వరుసగా బాలీవుడ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో ఆమె ఈ చాన్స్ కొట్టేసిందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి.  కాగా, కాజల్ స్థానంలో తమన్నాను ఎంపిక చేసుకున్నారని వస్తోన్న వార్తలపై బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా మండిపడ్డాడు.  సలు మీడియా వర్గాలు ఇంత దారుణంగా కల్పిత వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నించిన ఆయన ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు.

‘ముంబాయ్ సాగా' సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేశామని, కాజల్ బ్రిలియంట్ గా నటించారని చెప్పారు.  ఇందులో కాజల్ పాత్ర రెండు విభిన్న కోణాల్లో ఉండబోతోందని చాలా వినోదాత్మకంగా ఉంటుందని వెల్లడించారు. ఇక తెలుగు లో ‘సీత’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. ప్రస్తుతం కాజల్ నటించిన 'క్వీన్' తమిళ రీమేక్ 'పారిస్ పారిస్' విడుదలకు సిద్ధమవుతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు  కమల్ హాసన్ నటిస్తోన్న 'భారతీయుడు 2' సినిమాలో కూడా కాజల్ నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: