అందుకోసం మొదట కియరా అద్వానీ ఆతరువాత రష్మిక మందన్న ,కొద్దీ రోజుల క్రితం పూజా హెగ్డే లను సంప్రదించారు కానీ వారు ఎవ్వరు అఖిల్ తో చేయడానికి ఆసక్తి చూపించలేదు. దాంతో మళ్ళీ హీరోయిన్ వేట కొనసాగించారు. తాజాగా ఇప్పుడు అఖిల్ కు జోడి కోసం నాబా నటేష్ ను తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ఈసినిమాకు హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా కీలక కావడంతో నాభ అయితే ఆ రోల్ కు న్యాయం చేస్తుందని ప్రస్తుతం ఆమె తో సంప్రదింపులు జరుపుతున్నారట. మరి నాభ ,అఖిల్ తో నటించడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.
ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పతాకం ఫై బన్నీ వాసు , వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధం లో ఈచిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నాభ నటేష్ ప్రస్తుతం మాస్ రాజా రవితేజ సరసన డిస్కో రాజా అనే చిత్రంలో నటిస్తుంది.ఇటీవలే ఆమె ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఈ చిత్రం తరువాత నాభ ప్రస్తుతం తెలుగులో మరో సినిమా కు సైన్ చేయలేదు.