ఇప్పుడు ఆఫ్ ది కెమెరా అనగానే టేస్ట్ చేసి వాంతి చేసుకుంది. బిగ్ బాస్ నాకు అర్జెంటుగా టాస్క్ పేపర్ పంపించండి అది కూడా సీక్రెట్ గా అని శ్రీముఖి అడిగింది. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దని ఇదంతా గేమ్ లో భాగమని శిల్పతో మహేష్ అన్నాడు. ఈ హౌస్ లో రెండే గ్రూపులున్నాయని ఒకటి నలుగురు, రెండోది శ్రీముఖి, హిమజ గ్రూప్ అని మహేష్ శిల్పతో అన్నాడు. మిగిలిన మన ముగ్గురిలో బాబాని ఆల్రెడీ లాగేసుకున్నారని చెప్పాడు. బాబా కెప్టెన్ కావటానికి సహాయం చేసినా మీరు నేను ఆయనకు గుర్తులేమని అన్నాడు. శిల్ప కుక్కపిల్ల గురించి చెబుతుండగా హిమజకు తన కుక్క గుర్తొచ్చి ఏడ్చింది. బాబా మాస్టర్, శిల్ప, హిమజ, వితిక, రాహుల్ బెడ్ రూంలో ఉన్న ఎమర్జెన్సీ బాత్రూం నుంచి కోట్ యాడ్ కి రావాలనీ బిగ్ బాస్ అన్నాడు. అక్కడ ఒక స్మశానం సెట్ వుంది, బిగ్ బాస్ సభ్యులకు ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం అనే టాస్క్ ని ఇచ్చాడు.
ఈ ఇంట్లో ఒక శ్మశానం ఉంది అందులో ఐదు దయ్యాలు ఉన్నాయని దెయ్యాల ప్రధాన కర్తవ్యం మనుషులకు విసుగు తెప్పించి వాళ్లు రియాక్ట్ అయ్యేలా చేయటమని అన్నాడు. మనుషులు పట్టించుకోక పోయినా దెయ్యాలు మాత్రం అల్లరి చేయాలని చెప్పాడు. మనుషులకు విసుగు తెప్పించిన తరవాత దయ్యాల కర్తవ్యం వారిని చంపడం అన్నాడు. స్పెషల్ సాంగ్ కి దయ్యాలు అంతా డ్యాన్స్ చేసిన తర్వాత మనుషుల్ని ఒక్కొక్కరిగా చంపే ప్రక్రియ మొదలు పెట్టాలని అప్పటి వరకు విసిగిస్తూనే ఉండాలని ఈ రోజు ముగిసేలోగా దెయ్యాలకు కేవలం ముగ్గురు మనుషులను చంపే అవకాశం మాత్రమే ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. దెయ్యాలు మనుషుల్ని విజయవంతంగా చంపితే దెయ్యాలకు ప్రాణం వచ్చి మనుషులు అవుతాయని చనిపోయిన మనుషులు దెయ్యాలుగా మారుతారని అన్నాడు. రెండు ముద్దులు పెట్టి బాత్రూంలోని అద్దం మీద వరుణ్ ఈజ్ ఎ గోస్ట్ అని రాయాలని, శ్రీముఖి తలపై కోడుగుడ్డు కొట్టాలని, జ్యోతిని ఏడిపించాలని, రవిని మీ పాటలతో డ్యాన్స్ చేసేలా చేయాలని, పునర్నవిని స్విమ్మింగ్ పూల్లో తోసేయాలని, మహేష్ ని ఐదుసార్లు బట్టలు మార్చుకునేలా చేయాలని బిగ్ బాస్ చెప్పాడు.
హాల్లో చాలా సేపు హిమజ, జ్యోతి వెంటపడింది. వితిక, శిల్పా కలిసి శ్రీధర్ అంటూ శ్రీముఖికి మీసాలు పెట్టారు. ఆ తరవాత ఆమెపై కోడిగుడ్డు పగల గొట్టారు. వితిక వెళ్లి వరుణ్ ని ముద్దు పెట్టుకుని బాత్రూంలోని మిర్రర్ మీద వరున్ ఈజ్ ఎ గోస్ట్ అని రాసింది. బాబా మాస్టర్, రాహుల్ కలిసి మహేష్ షర్ట్ విప్పేశారు. మళ్లీ షర్టు వేసుకుని వస్తే అవి కూడా విప్పేశారు. నలుగురు దయ్యాలు కలిసి పునర్నవిని ఎత్తుకెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడేశారు. దెయ్యం వితిక చేతిలో వరుణ్ ప్రాణాలు కోల్పోయాడని బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక పై వరుణ్ దెయ్యంగా మారతాడని వితిక మనిషిగా మారుతోందని అన్నాడు. తరవాత హిమజ చేతిలో శ్రీముఖి ప్రాణాలు కోల్పోయిందని బిగ్ బాస్ చెప్పాడు. పునర్నవి పూల్ లోంచి బయటకు రాబోతుండగా శిల్ప వెళ్లి మళ్లీ తోస్తుంది. పునర్నవి కూడా దెయ్యంగా మారిందని శిల్ప మనిషిగా మారిందని బిగ్ బాస్ అన్నాడు.
వాష్ రూంలో పునర్ణవితో శ్రీముఖి టాస్క్ గురించి చెప్పింది. ఇది గెలిస్తేనే లగ్జరీ బడ్జెట్ వస్తుందని అంది. ఇది పెద్ద వేస్ట్ టాస్క్ అని బిగ్ బాస్ తో పునర్నవి చెప్పింది. మీ గేమ్ మీరే ఆడుకోండి అని అంది. వరుణ్ వెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు, మనకు చెప్పింది విని ఈడ్చుకెళ్లి పడేశారు. శిల్ప వచ్చి మళ్లీ తోసింది. ఎక్కడెక్కడో దెబ్బలు తగిలాయని పునర్నవి అంది. ఒకేసారి రెండు టాస్క్ లు కంప్లీట్ కావని నిన్ను ఫస్ట్ తోసినప్పుడు అక్కడ శ్రీముఖి మీద గుడ్డు పగిలిందని అందుకే మళ్లీ నిన్ను తోసేశారని వరుణ్ చెప్పాడు. నొప్పిగా ఉన్నప్పుడు రియాక్ట్ కాకుండా పునర్నవి టాస్క్ గురించి తెలిసిన తర్వాత ఇలా మాట్లాడటం బాగా లేదని హిమజ, వితిక, శిల్పా మాట్లాడుకున్నారు. అలా బిగ్ బాస్ హౌస్ లో యాభై ఒకటవ రోజు ముగిసింది.