టాలీవుడ్ సినిమా పరిశ్రమకు విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ, ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇప్పటివరకు మరొక తెలుగు సినిమా మొదలెట్టలేదు. అయితే ఇటీవల మధ్యలో బాలీవుడ్ లో అదే అర్జున్ రెడ్డి సినిమాను షాహిద్ కపూర్, కియారా అద్వానీ ల కలయికలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించి, అక్కడ కూడా సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సందీప్, కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్  మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్నట్లుగా వార్తలు ప్రచారం అయ్యాయి. 

తమ కాంబో సినిమాకు సంబంధించి మహేష్ గారికి ఒక లైన్ చెప్పాను, ఆయనకు నచ్చింది, అది పూర్తి స్క్రిప్ట్ గా  మారడానికి మరికొంత సమయం పడుతుందని ఇటీవల సందీప్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. దీనినిబట్టి సందీప్ తో మహేష్ బాబు సినిమా ఉంటుందని అందరికి అర్ధం అయింది, అయితే అది ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇకపోతే తాజాగా తన తదుపరి సినిమాను సందీప్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్, రణబీర్ కపూర్ కు ఇటీవల ఒక స్టోరీ వినిపించిన సందీప్, ఆ కథ ఆయనకు నచ్చడంతో వీలైనంత త్వరలో సినిమాను మొదలెడదాం అని చెప్పారట. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీబిజీ గా ఉన్న రణబీర్, 

అవి త్వరలోనే పూర్తి అవుతాయని, ఈలోపు తమ సినిమాకు ముహూర్తం నిర్ణయించి మొదలెడదాం అని చెప్పారట. భూషణ్ కుమార్ నిర్మాతగా రూపొందనున్న ఈ సినిమా కూడా అర్జున్ రెడ్డి మాదిరిగా సహజత్వానికి దగ్గరగా ఉండే కథతో రూపొందనున్నట్లు సమాచారం. ఇక సందీప్, రణబీర్ సినిమా కన్ఫర్మ్ అయిన వార్తలను నేడు ఒక జాతీయ పత్రిక వెల్లడించింది. దీనితో సందీప్ తదుపరి సినిమాపై వస్తున్న పుకార్లకు ఎట్టకేలకు తెరపడ్డట్లైంది. కాగా ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్ సినిమా వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: