తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 మొదలై ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఈ షో నుండి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషు రెడ్డి, అలీ రేజా ఎలిమినేట్ అయ్యారు. ఈ షోకు ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. మొదట వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి ఇప్పటికే ఎలిమినేట్ అయింది. ఆ తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం శ్రధ్ధా దాస్, ఈషా రెబ్బా, హెబ్బా పటేల్ పేర్లు వినిపించినా యాంకర్ శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. 
 
ఈ వారం ఎలిమినేషన్ కు ఐదుగురు బిగ్ బాస్ ఇంటి సభ్యులు శిల్పా చక్రవర్తి, మహేశ్ విట్టా, పునర్నవి భూపాళం, హిమజ, శ్రీముఖి నామినేట్ అయ్యారు. రవి కృష్ణ కూడా ఎలిమినేషన్ కు నామినేట్ అయినప్పటికీ కెప్టెన్ బాబా భాస్కర్ కు బిగ్ బాస్ ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇవ్వటంతో బాబా భాస్కర్ రవికృష్ణను సేవ్ చేస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని అనధికారిక పోల్స్ ప్రకారం ఈ వారం శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. 
 
శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోవటం లేదు. మిగిలిన ఇంటి సభ్యులకు ఇప్పటికే కొంతమంది ఫ్యాన్స్ ఏర్పడి ఎలిమినేట్ కాకుండా సపోర్ట్ చేస్తున్నారు. యాంకర్ శ్రీముఖికి సోషల్ మీడియా, వాట్సాప్ గ్రుపులలో ఫ్యాన్స్ ఏర్పడి ఓట్ చేస్తున్నారు. హిమజ, పునర్నవికి కూడా ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. మహేశ్ విట్టా ఇప్పటికే చాలా సార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయినా సేవ్ అవుతూ వస్తున్నాడు. 
 
మరోవైపు ఆదివారం రోజు ఎలిమినేట్ అయిన అలీ రేజా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో అలీ చాలా స్ట్రాంగ్ కాంటెస్టెంట్. అలీ ఖచ్చితంగా ఫైనల్ వరకు వెళతాడని బిగ్ బాస్ అభిమానులు కూడా ఆశించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అలీ ఎలిమినేట్ కావటం జరిగింది. మరి వినిపిస్తున్న వార్తల ప్రకారం అలీ రేజా రీఎంట్రీ ఇస్తాడో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: