టాలీవుడ్ లో సెకండ్ గ్రేడ్ హీరోలు సైతం సూపర్ హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఒకటి రెండు సినిమాలు చేసిన హీరోలు అర్జున్ రెడ్డి వంటి మాస్ సినిమా చేసి యూత్ లో స్టార్స్ గా గుర్తింపు పొందుతున్నారు. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారు. అయితే, సినీ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హీరోలు మాత్రం ఈ విషయంలో వెనకబడిపోతున్నారు. కారణం ఏంటి ఎందుకు వాళ్ళు వెనకబడిపోతున్నారు. ముఖ్యంగా అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న హీరోలు ఎందుకు వెనుకబడి పోతున్నట్టు.
చైతన్య ఇప్పటి వరకు 19 సినిమాలు చేశారు. ఇందులో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. స్టార్ హీరో కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఈ హీరోలు ఆఫర్లు వస్తున్నాయి. ఆఫర్ల విషయం పక్కనపెడితే.. సినిమాను ఎంపిక చేసుకోవడంలో తడబాటుకు గురవుతున్నారు. ఫలితంగా సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. చైతు మజిలీ సినిమాతో తిరిగి లైన్లోకి వచ్చాడు. ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి వెంకిమామ చేస్తున్నాడు. దీంతో పాటు శేఖర్ కమ్ముల సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, ఇప్పుడు ఈ హీరో బాలీవుడ్ లో సూపర్ హిట్టైన సినిమాలపై దృష్టిపెట్టారు. గతేడాది వచ్చి మంచి విజయం సాధించిన సినిమాల్లో బదాయి హో సినిమాను తెలుగులో డబ్బింగ్ చేయబోతున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, దిల్ రాజులు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో నాగ చైతన్య హీరో. ఆయుష్మాన్ ఖురానా చేసిన పాత్రను చేయబోతున్నారు.
మరోవైపు బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా చేసిన ఆందాధున్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రవివర్మ దర్శకుడు. నితిన్ హీరోగా ఈ సినిమాను తెరక్కించబోతున్నారు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్టా మూవీస్ లో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరలోనే ఈ రెండు సినిమాలు తెరకెక్కబోతున్నాయి. టాలీవుడ్ లో హిట్టైన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తుంటే.. అక్కడ హిట్ కొట్టిన సినిమాలను తెలుగులో చైతు, నితిన్ లు రీమేక్ చేస్తుండటం విశేషం. ఒకవేళ ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా హిట్టయితే.. మరిన్ని సినిమాలను ఈ హీరోలు రీమేక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరు హీరోలు సక్సెస్ విషయముల వెనకబడి ఉన్నారు.