టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది. మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన రష్మిక మందున్న జోడి కడుతోంది. 

ఆకట్టుకునే కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతితో పాటుగా కమెడియన్ బండ్ల గణేష్, సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, సంగీత, హరితేజ, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, సీనియర్ నరేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నటి మీనాక్షి దీక్షిత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు ప్రచారం అవడంతో, 'అటువంటిది ఏమి లేదని, మహేష్ గారి ప్రక్కన మళ్ళి మళ్ళి నటించే అవకాశం వస్తే ఎవరు మాత్రం నటించరు చెప్పండి', 

అంటూ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మీనాక్షి. నిజానికి మీనాక్షి గతంలో సూపర్ స్టార్ హీరోగా నటించిన దూకుడు సినిమా టైటిల్ సాంగ్ లో మహేష్ తో కలిసి చిందేసింది. అలానే ఇటీవల ఎపిక్ బ్లాక్ బస్టర్ మహర్షి లో కూడా మహేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తన్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు వరుస బ్లాక్ బస్టర్ విజయాలు తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్, ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: