స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ఆ అంచనాలు అందుకోలేక ఫ్లాప్ గా మిగిలింది. అంతకముందు ఆయన నటించిన డీజే పర్వాలేదనిపించింది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా పైనే బన్నీ ఆశలు పెట్టుకున్నాడు. మంచి కమర్షియల్ అంశాలతో ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. బన్నీ సరసన డీజే సినిమాలో జతకట్టిన పూజ హెగ్డే, మరొక్కసారి ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటి టబు ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, 

హీరోయిన్ నివేత పేతురాజ్ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో కు వారి నుండి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఇక రాబోయే దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయాలని చూస్తోందట యూనిట్. ఈ మేరకు అప్పుడే టీజర్ కోసం సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను కట్ చేసే పనిలో పడ్డారట ఎడిటింగ్ టీమ్. టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతాయని భావిస్తోందట సినిమా యూనిట్. 

నేటి ఉదయం నుండి విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే బన్నీ ఫ్యాన్స్ కి దసరా నాడు మరొక పెద్ద పండుగే అని చెప్పాలి. అయితే దీనిపై అల వైకుంఠపురములో టీమ్ నుండి ఒక అధికారిక ప్రకటన రిలీజ్ అయితేనే కానీ పూర్తి స్థాయిలో నమ్మలేం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. మురళి శర్మ, నవదీప్, సత్యరాజ్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, హర్షవర్ధన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా, ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: