మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ "చిత్ర లహరి" సినిమా సక్సెస్ తో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సినిమాకు ముందు ౩ సంవత్సరాల కాలంలో ఆయన నటించిన ఆరు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాలో నివేతా పేతురాజు,కల్యాణి ప్రియదర్శిని లు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మరియు పొసాని మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి.సునీల్ మరియు వెన్నెల కిషోర్ లతో కామెడీ బాగా పండింది. సమ్మర్ కి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతీ రోజూ పండగే అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా పేరుకు తగ్గట్టు గా ఉంది.బ్రిడ్జ్ పైన వర్షంలో సత్యరాజ్(కట్టప్ప) గాలిలో జంప్ చేస్తుంటాడు .ఆయనను చూసి సాయి ధరమ్ తేజ్ ఆనందంతో ఆశ్చర్యపోతాడు.ఇద్దరి చేతిలో గోడుగులు ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడటనికి చాలా కలర్ ఫుల్ ఉంది. ఈ సినిమా ఒక పల్లెట్టూరి బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక మంచి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుంది.
ఈ సినిమా లో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది.థామన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాకు బన్నివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయనున్నారు. ప్రతీ రోజూ పండగే సినిమా హిట్ అవ్వడం మారుతి కెరియర్ కి చాలా అవసరం.ఎందుకంటే గత కొంత కాలంగా ఆయనకు సరియైన హిట్ లేదు.ఈ సినిమా తరువాత సాయి ధరమ్ తేజ్ దేవా కట్టా దర్శకత్వంలో నటించనున్నాడు