ఒకేవేళ అదే జరిగితే మొత్తానికి సూర్యకు చాలా రోజుల తరువాత విజయం దక్కుతుంది. మరి ఏంజరుగుతుందో తెలియాలంటే ఈనెల 20వరుకు ఆగాల్సిందే. ఈ చిత్రం తెలుగులో బందోబస్త్ పేరుతో అదే రోజు విడుదలకానుంది. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదలచేస్తున్నారు. ఇక వరుస పరాజయాల కారణంగా తెలుగులో సూర్య మార్కెట్ దారుణంగా పడిపోయింది మరి ఈ చిత్రం తోనైనా సూర్య తన మార్కెట్ ను మెరుగుపరుచుకుంటాడో లేదో చూడాలి. రంగం ఫేమ్ కేవీ ఆనంద్ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సయేశా సైగల్ కథానాయికగా నటించగా మోహన్ లాల్ , ఆర్య , బోమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించాడు.